Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ చిత్ర పరిశ్రమలో బయోపిక్ల ట్రెండ్కి మంచి క్రేజ్ ఉంది. రాజకీయ, సినీ, క్రీడలు సహా పలు రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన పలువురి జీవిత చరిత్రలు వెండితెరపై ఆవిష్కృతమవుతున్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2000లో జరిగిన ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించడమే కాకుండా ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డ్ క్రియేట్ చేసిన కరణం మల్లేశ్వరి జీవితం ఆధారంగా ఓ బయోపిక్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తినిచ్చిన కరణం మల్లేశ్వరి బయోపిక్ను పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎం.వి.వి.సినిమా, కె.ఎఫ్.సి బ్యానర్స్పై ఎం.వి.వి.సత్యనారాయణ, కోనవెంకట్ నిర్మిస్తున్న ఈ బయోపిక్కు సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కోనవెంకట్ ఈ చిత్రానికి రచయితగా కూడా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రంలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.