Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నటిగానే కాకుండా నిర్మాతగానూ అనుష్కశర్మ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటోంది. వైవిధ్యమైన కాన్సెప్ట్లతో సినిమాల్నే కాకుండా వెబ్సిరీస్లను సైతం నిర్మిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఓటీటీ ఫ్లాట్ఫామ్లో విడుదల చేసిన ఃపాతాళ్లోక్ః వెబ్ సిరీస్కి విశేష స్పందన లభించింది. అయితే ఇది విడుదలైన దగ్గర్నుంచి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. ఇందులోని ఓ సన్నివేశంలో గూర్ఖా వర్గాన్ని కించపరిచేలా సంభాషణలున్నాయంటూ ఆ వర్గం వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే భాజాపా ఎమ్మెల్యే నందకిశోర్ గుర్జర్ తన అనుమతి లేకుండా ఓ సన్నివేశంలో తన ఫొటో వాడారంటూ కేసు పెట్టారు. ఇదిలా ఉంటే, సైఫ్ ఆలీ ఖాన్ నటించిన ఃస్కేర్డ్ గేమ్స్ః వెబ్ సిరీస్ మాదిరిగా ఈ సిరీస్ ఉందంటూ నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ సిరీస్పై ఇప్పటివరకు ఎన్ని ఆరోపణలు వచ్చినా స్పందించని
అనుష్క శర్మ ఃస్కేర్డ్ గేమ్స్ఃతో పోల్చడంపై స్పందించారు.
ఃప్రజలు ఎప్పుడూ రెండింటి మధ్య పోలికలు వెతకడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ రెండు సిరీస్లు పూర్తిగా భిన్నం.
దేని ప్రత్యేకత దానికి ఉంది. ఓటీటీ వేదికగా మంచి కంటెంట్ ఇచ్చేందుకు చాలా మంది కష్టపడి పని చేస్తున్నారు. వారందర్నీ అభినందిస్తున్నాః
అని ట్విట్టర్లో అనుష్మ పోస్ట్ చేశారు.