Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భరత్ సాగర్, యశస్విని రవీంద్ర హీరో హీరోయిన్లుగా భవసపందన ప్రొడక్షన్ ప్రవేట్ లిమిటెడ్, బిఎండబ్ల్యు పతాకాలపై రూపొందుతున్న చిత్రం 'లాస్ట్ పెగ్'. లేటెస్ట్గా ఈ చిత్రంలోని మొదటి లిరికల్ వీడియో సాంగ్ 'పోరి కిక్కా.. బాటిల్ కిక్కా'ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సాంగ్ను పాపులర్ సింగర్ హేమచంద్ర పాడగా, ఎన్నో సూపర్ హిట్ పాటలు రాసిన భాష్యశ్రీ ఈ పాటను రచించారు. విజరు ఆంటోని నటించిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్కు భాష్యశ్రీ సాహిత్యం అందించిన విషయం విదితమే.
ఈ సందర్భంగా డైరెక్టర్ సంజరు మాట్లాడుతూ,' ఇటీవల యాక్షన్ టీజర్ను విడుదల చేశాం. తాజాగా 'పోరి కిక్కా బాటిల్ కిక్కా' లిరికల్ వీడియో విడుదల చేశాం. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ డిటైల్స్ను విడుదల చేయబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు హైలెట్గా నిలుస్తాయి' అని తెలిపారు. భారత్ సాగర్, యశస్విని రవీంద్ర జంటగా నటించిన ఈచిత్రానికి సంగీతం: లోకేష్, మ్యూజిక్ ప్రొడ్యూసర్: సంజీవ్.టి, డిఓపి: కార్తిక్ కుమార్ కొణిదెల, ఎడిటర్: రుత్విక్, నిర్మాత: రజత్ దుగోజి సలేంకి, రచన, దర్శకత్వం: సంజరు వడత్. ఎస్.