Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాక్డౌన్ అమలులో ఉన్న కారణంగా సినీ కార్మికులను సిసిసి ద్వారా ఆదుకుంటున్న విషయం విదితమే. అలాగే ప్రముఖ వైద్యులు, సామాజిక కార్యకర్త డా|| ఆనంద్ తన మిత్రుల సహకారంతో బంజారా మహిళా ఎన్జీవో ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా దాదాపు 15 రాష్ట్రాలలో కరోనా సహాయక శిబిరాలు నిర్వహిస్తున్నారు. తాజాగా తన స్నేహితురాలు వైఎస్సార్సిపి ఎన్ఆర్ఐ వింగ్ స్వర్ణ లత కట్టా సహకారంతో తెలంగాణా రాష్ట్రంలోని గిరిజనులు, పేద ప్రజలు, వలస కూలీలకు నిత్యావసర వస్తువులను డా|| ఆనంద్, ప్రశాంత్ ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్బంగా డా|| ఆనంద్ మాట్లాడుతూ, 'మా ప్రయత్నానికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు. కరోనా మహమ్మారిని విజయవంతంగా తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా భౌతిక దూరం పాటించి, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలను మరింత మంది దాతలు సహకారం అందించాలని కోరుతున్నాను' అని చెప్పారు.