Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా విపత్కర కాలంలో సినీ కార్మికులు పడుతున్న ఇబ్బందులకు తమ వంతు సాయం అందించేందుకు 'పరారి' చిత్ర బందం ముందుకు వచ్చింది. 'పరారి' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న యోగీశ్వర్ చేతుల మీదుగా 24 క్రాప్ట్స్కి సంబంధించిన కార్మికులకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా హీరో యోగీశ్వర్ మాట్లాడుతూ,'మా సినిమా తరఫున ఈ కష్ట సమయంలో ఏదైనా సహాయం చేద్దాం అనే ఆలోచన కలిగింది. మా నాన్న (నిర్మాత) గిరి గారు నిత్యావసరాలు పంపిణీ చేద్దాం అన్నారు. హీరో సుమన్ గారు కూడా ఈ ఆలోచనను అభినందించారు. వారి ప్రోత్సాహంతో ఈ నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నాం. త్వరలో షూటింగ్స్ ప్రారంభం అవుతాయి. అలాగే థియేటర్స్ దగ్గర మామూలు పరిస్థితులు కనిపిస్తాయని నమ్ముతున్నాను' అని చెప్పారు. నిర్మాత గిరి మాట్లాడుతూ, 'నేను సుమన్ గారికి అభిమానిని. ఆయన ప్రోత్సాహంతోనే నిర్మాతగా మారాను. ఇప్పుడు కరోనాతో చాలా మంది సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే దాదాపు 250 మందికి పైగా సినీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశాం' అని తెలిపారు.