Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు నిత్యావసరాలను అందించిన తలసాని సాయి కిరణ్, ఇకముందు కూడా ఇలాగే సినీ కార్మికులను ఆదుకుంటా మన్నారు. హైదరాబాదు ఫిలిం చాంబర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సి.కల్యాణ్, అభిషేక్ నామా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ, 'తలసానిగారితో 30 ఏళ్ల అనుబంధం. రాజకీయంగా తలసాని గారు ఎదిగినా, మాతో రిలేషన్ మాత్రం అలానే ఉంది. సినీ కార్మికులకు అండంగా ఉండి నిత్యావసరాలను ఇచ్చారు. సినీ పరిశ్రమకు అండగా తలసానిగారిలా మరెవరు లేరు. సిఎం కేసిఆర్ కూడా మా పరిస్థితులను అర్ధం చేసుకున్నారు. అతి త్వరలోనే చిత్రీకరణలకు అనుకూలంగా జీవోను ఇవ్వనున్నారు' అన్నారు.
'తలసాని శ్రీనివాస్గారు మా నిర్మాతలకు ఎంతో అండగా ఉన్నారు. ఆయన తనయుడు తలసాని సాయి తమ ట్రస్ట్ ద్వారా కార్మికులను ఆదుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరికీ ధన్యవాదాలు' అని నిర్మాత అభిషేక్ నామా చెప్పారు. తలసాని సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ, 'తెలంగాణాను సాధించటంతో పాటు, రాష్టాన్ని అభివద్ధి పథంలో కేసీఆర్గారు నడిపిస్తున్నారు. అలాగే సినీ పరిశ్రమ విషయంలో కూడా సీఎం ప్రత్యేక శ్రద్ద పెట్టారు. తలసాని శ్రీనివాస్గారికి సినిమాలంటే ప్రేమ. ప్రతి సినిమాను తొలిరోజు చూస్తారు. చిరంజీవి, నాగార్జున, మిగతా అసోషియేషన్స్ అంతా కలిసి లీడ్ తీసుకుని చిత్రీకరణ విషయంలో సమావేశాలు ఏర్పాటు చేశారు. అలాగే సి.సి.సి ద్వారా, మా ట్రస్ట్ ద్వారా సినీ కార్మికులను ఆదుకుంటున్నాం' అని తెలిపారు.