Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మీ సినిమా 'లక్ష్మీబాంబ్' థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల కావడాన్ని మీరు ఫీల్ అవుతున్నారా? అంటూ నెటిజన్లు నన్ను ప్రశ్నిస్తున్నారు. నా సినిమా ఓటీటీలో రిలీజైతే నేనెందుకు ఫీలవుతాను?, ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేయలేం. అందుకే మా దర్శక, నిర్మాతలు ఓటీటీ మార్గాన్ని ఎంచుకున్నారు' అని కైరా అద్వానీ తెలిపింది.
అక్షరుకుమార్తో కలిసి కైరా నటించిన చిత్రం 'లక్ష్మీబాంబ్'. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రాన్ని లాక్డౌన్ కొనసాగుతున్న కారణంగా త్వరలోనే డిస్నీప్లస్ హాట్స్టార్లో రిలీజ్ చేయబోతున్నారు. తెలుగులో ఘనవిజయం సాధించిన 'కాంచన' చిత్రానికిది రీమేక్. ఇదిలా ఉంటే, 'లక్ష్మీబాంబ్'తో పాటు సుశాంత్ సింగ్ రాజ్ఫుత్ నటించిన ఆఖరిచిత్రం 'దిల్ బేచారా', 'బాలీవుడ్ కి హోం డెలివరీ', 'భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా', 'సడక్ 2', 'ది బిగ్బుల్', 'ఖుదాఫీజ్', 'లూట్ కేస్' వంటి తదితర చిత్రాలను సైతం డిస్నీప్లస్ హాట్స్టార్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కథానాయిక కైరా అద్వానీ పై విధంగా స్పందించింది.