Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సరికొత్త థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన చిత్రం 'ఎ'. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదలతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతుండటం ఆశ్చర్యంగా ఉంది. లేటెస్ట్గా విడుదలైన టీజర్ చూస్తే ఖచ్చితంగా ఈ చిత్రం సినీ ప్రియులకు ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్ ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తుంది' అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలను చిత్రయూనిట్ తెలుపుతూ, 'తన తొలి చిత్రంలోనే నితిన్ ప్రసన్న 3 విభిన్నమైన పాత్రలను పోషించడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ను 5 లక్షల మంది వీక్షించారు. ఇంకా ప్రేక్షకులు టీజర్ను చూస్తూనే ఉన్నారు. ఒక చిన్న సినిమాకు ఇంత భారీగా ఆదరణ రావడం విశేషం. డిఫరెంట్గా ప్రెజెంట్ చేస్తే ఆడియన్స్ కచ్చితంగా రిసీవ్ చేసుకుంటారని దానికి మా సినిమా టీజర్ బెస్ట్ ఉదాహరణ. యుగంధర్ ముని ఎంచుకున్న డిఫరెంట్ పాయింట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండనుంది. త్వరలో ఈ చిత్ర ఆడియోను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు' అని పేర్కొంది.