Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం భారత్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా చైనాకి సంబంధించి యాప్లను భారత్ నిషేధించింది. దీంతో అక్కడ పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. ఇటీవల గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికులు మధ్య జరిగిన గొడవల్లో ఇరవై మంది భారత సైనికులు అమరులయ్యారు. ఇలాంటి నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ప్రముఖ నటుడు, దర్శకుడు మేజర్ రవి ఓ సినిమాను రూపొందించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 'బిడ్జ్ ఆఫ్ గాల్వన్' పేరుతో తెరకెక్కబోయే ఈ చిత్రంలో మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ నటించనున్నారట. గతంలో వీరి కాంబినేషన్లో '1971 బియాండ్ బోర్డర్స్' సినిమా విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. అలాగే ఇందులో అల్లు శిరీష్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.