Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'దేశ భద్రత దృష్ట్యా భారత ప్రభుత్వం తీసుకున్న చైనా యాప్స్ నిషేధంపై నమ్మకం ఉంచండి' అని అంటోంది బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్. ప్రస్తుతం భారత్, చైనాల మధ్య జరుగుతున్న పరిణామాలపై కంగనా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'చైనా యాప్స్ను మన దేశ ప్రభుత్వం నిషేధించగానే చాలా మంది సంబరాలు చేసుకుని ఉంటారు. ఎందుకంటే మన దేశ ఆర్థిక వ్యవస్థలోకి చైనా ఎంతలా చొచ్చుకొచ్చిందో అందరికీ తెలుసు. మన వర్తక వ్యాపారాలు చాలా వరకు ఆ దేశంపైనే ఆధారపడి ఉన్నాయి. కానీ, ఈ ఏడాది చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని కష్టాల్లోకి నెట్టింది. ఇలాంటి సంక్షోభ సమయంలో వాళ్ళు మన సరిహద్దుల్లో గొడవలకు దిగుతున్నారు. ఇప్పటికే కరోనాతో ప్రపంచంపై బయోవార్కి దిగారు. వారికి ముఖ్యమైనది ఆర్థిక వ్యవస్థ. భారత్లో చైనా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తే ఆ దేశ దుష్ట అధికారాలు కూడా తగ్గుతాయి. అప్పడే ప్రపంచం మంచి స్థాయిలో ఉంటుంది. ఇకనైనా దేశ ప్రజలందరూ దేశీయ ఉత్పత్తులను ఉపయోగించాలి' అని కంగనా పేర్కొంది.