Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ నటించిన 'క్రాక్', గోపీచంద్ సినిమా 'సీటీమార్', శర్వానంద్ చిత్రం 'శ్రీకారం', రానా నటించిన 'విరాటపర్వం' వంటి పెద్ద సినిమాల నైజాం హక్కులను సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనివాస్ టాక్ ఆఫ్ ది ఇండిస్టీగా నిలిచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'చాలా పోటీ ఉన్నప్పటికీ మంచి ఫ్యాన్సీ రేటుతో రవితేజ 'క్రాక్', గోపీచంద్ 'సీటీమార్', శర్వానంద్ 'శ్రీకారం', రానా 'విరాటపర్వం' సినిమాల నైజాం హక్కులను దక్కించుకోవడం ఆనందంగా ఉంది. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా థియేటర్లు మూతపడటంతో వీటి విడుదల ఆగిపోయింది. లేకపోతే ఈ పాటికే ఇవన్ని ప్రేక్షకుల ముందుకి వచ్చేవి. అలాగే మరికొన్ని సినిమాల నైజాం హక్కుల కోసం కొంతమంది నిర్మాతలతో సంపద్రింపులు చేస్తున్నాను. ఓ వైపు డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటూనే, నిర్మాతగా కూడా మారాను. తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణ సగం పూర్తయింది. మిగతాది ఫారిన్ లొకేషన్లలో చిత్రీకరిస్తాం. దీని తర్వాత రెండు కొత్త సినిమాలను కూడా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.