Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'వకీల్సాబ్'. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన 'పింక్' చిత్రాన్ని 'వకీల్సాబ్' పేరుతో రీమేక్ చేస్తున్న విషయం విదితమే. అయితే ఇందులో పవన్కళ్యాణ్ సరసన శతిహాసన్ నటిస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అలాగే ఈ సినిమాలో నటించడం లేదని శతి పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన వార్తలూ అన్నిచోట్లా షికార్లు చేశాయి. ఆ తర్వాత ఇలియానా, కాజల్.. ఇలా కొన్ని పేర్లు వినిపించినప్పటికీ ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. దీంతో పవన్ సరసన ఏ కథానాయిక నటిస్తుందనే ప్రశ్నకు సమాధానం సస్పెన్స్గా ఉండిపోయింది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, పవన్ సరసన తమన్నా మెరవబోతోందట. గతంలో పవన్, తమన్నా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలో నటించిన విషయం విదితమే. 'వకీల్సాబ్'లో తమన్నాతో పాటు అంజలి, నివేదా థామస్, అనన్యలు సైతం నటిస్తున్నారు.