Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవీన్ చంద్ర హీరోగా, సలోని లూథ్రా హీరోయిన్గా నటించిన చిత్రం 'భానుమతి అండ్ రామకష్ణ'. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై శరత్ మరార్ సమర్పణలో క్రిషివ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై యశ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ఫామ్ ద్వారా శుక్రవారం విడుదలై అందరి ప్రశంసల్ని సొంతం చేసుకుంటోంది.ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని హీరో నవీన్ చంద్ర, చిత్ర సమర్పకుడు శరత్ మరార్, దర్శకుడు శ్రీకాంత్ నాగోతి, నిర్మాత యశ్వంత్ ములుకుట్ల తదితరులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ప్రత్యేకంగా కలిశారు. చిత్రయూనిట్ను తలసాని అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'నవీన్ చంద్ర హీరోగా యంగ్ టీమ్ చేసిన ప్రయత్నమే ఈ సినిమా. ఓ మంచి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ నాగోతి, నిర్మాత యశ్వంత్ ములుకుట్ల, సమర్పకుడు శరత్ మరార్ని అభినందిస్తున్నాను. అల్లు అరవింద్కి చెందిన 'ఆహా' ఓటీటీలో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో పనిచేసిన హీరో, హీరోయిన్స్ సహా యూనిట్ మొత్తానికి అభినందనలు. ప్రస్తుతం కరోనా వల్ల చిత్ర పరిశ్రమ చాలా సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా విడుదలకు సిద్ధమైన సినిమాలను థియేటర్లలో విడుదల చేసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీల ద్వారా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనూ తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగానికి సహాయ సహకారాలను అందిస్తూనే ఉంది. ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.