Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ నిర్మాత పోకూరి రామారావు (64) ఇకలేరు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది నెలకొనటంతో ఆయన మృతి చెందారు. కరోనా వల్ల పోకూరి రామారావు చనిపోవడం బాధాకరమని పలువురు సినీ ప్రముఖులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయనతో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే ఉత్తమాభిరుచిగల నిర్మాతను కోల్పోవటం తెలుగు చిత్ర సీమకు తీరని లోటని చెప్పారు. తెలుగునాట ఈతరం ఫిలిమ్స్ బ్యానర్కు ఓ ప్రత్యేక ఉంది. ఆ ప్రత్యేకతను తీసుకురావడంలో ఆ బ్యానర్కు సమర్పకుడిగా వ్యవహరించిన నిర్మాత పోకూరి బాబురావు సోదరుడు పోకూరి రామారావు కృషి ఎంతో ఉంది. గోపీచంద్తో 'రణం', 'యజ్ఞం' వంటి చిత్రాలను నిర్మించారు. అభిరుచిగల నిర్మాతగానే కాకుండా సామాజిక సమస్యలపై తన సినిమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన నిర్మాతగానూ పోకూరి రామారావుకి పరిశ్రమలో మంచి పేరు ఉంది. ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు విలువలతో కూడిన సినిమాలనే అభిప్రాయాన్ని ప్రేక్షకులకు కలిగించడంలో రామారావు విజయం సాధించారు. రామారావు అంత్యక్రియలు శనివారం రోజు జరిగాయని ఆయన సన్నిహితులు తెలిపారు. రామారావుకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.