Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాహుబలి' తర్వాత కథానాయకుడు ప్రభాస్కు జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా బాలీవుడ్లో క్రేజీ హీరోగా అక్కడి ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. అలాగే 'సాహౌ' తర్వాత ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నోసార్లు ఎన్నో వార్తలొచ్చాయి. కానీ అవేమీ కార్యరూపం దాల్చలేదు. అయితే లేటెస్ట్గా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అయ్యింది. ఇటీవల అజరుదేవగన్తో 'తన్హాజీ' వంటి భారీ పీరియాడికల్ సినిమాకి దర్శకత్వం వహించిన ఓమ్ రౌత్తో ప్రభాస్ బాలీవుడ్లో ఓ సినిమా చేసేందుకు గ్రీన్సిగల్ ఇచ్చారట. ప్రభాస్ ప్రస్తుతం 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'రాధేశ్యామ్' అనే టైటిల్ని పెట్టే యోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి చిత్రీకరణ త్వరలోనే ఓ భారీ హాస్పిటల్ సెట్లో షురూ కానుంది.