Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత ఫుట్ బాల్ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ యదార్థ కథ ఆధారంగా అజరు దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'మైదాన్'. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 13, 2021న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా నిర్మాత బోనీకపూర్ మాట్లాడుతూ, 'ఫుట్ బాల్ కోచ్గా అజరు దేవగన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఒక స్ఫూర్తిమంతమైన కథతో నిర్మిస్తున్నార. క్రీడానేపథ్యంలో సాగే ఈ సినిమా ఆద్యంతం అందరినీ అలరిస్తుంది. ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా మైదాన్ను వచ్చే ఏడాది ఆగస్ట్ 13న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తాం. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ చిత్ర ఇతివత్తం ఉంటుంది' అని తెలిపారు.
జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి, 'బధాయి హౌ' ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రెష్లైమ్ ఫిల్మ్ సహకారంతో జీ స్టూడియోస్ బేనర్పై బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జారు సేన్ గుప్తా నిర్మిస్తున్నారు. 'బధాయి హౌ' చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.