Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాలీవుడ్లో చాలా మంది కథానాయికల మాదిరిగానే నేనూ నెపోటిజం బాధితురాలినే. ఇదే సమస్యను తామూ ఎదుర్కొన్నట్టు ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ చెప్పారు. కెరీర్ ప్రారంభంలో మేమంతా బంధు ప్రీతి బారిన పడిన వాళ్ళమే' అని అంటోంది తాప్సీ. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో నెపోటిజంపై చర్చ మొదలైంది. బాధితులంతా సోషల్ మీడియా వేదికగా తమ నిరసస వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాప్సీ సైతం తాను ఎదుర్కొన్న నెపోటిజిం గురించి మాట్లాడుతూ,'బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వారికి అవకాశాలు సులభంగా వస్తాయి. ఏ నేపథ్యం లేకుండా వచ్చినవారికి పరిచయాలు ఏర్పడటానికి బాగా సమయం పడుతుంది. కెరీర్ మొదట్లో నేనూ పరిచయాలు, లౌక్యం లేక చాలా అవకాశాలు కోల్పోయాను. అప్పుడు నేను అనుభవించిన
ఆ బాధను మాటల్లో వర్ణించలేను.బాలీవుడ్లోనే కాదు
ఏ భాషా సినీ పరిశ్రమలోనైనా నెపోటిజం పెరగటానికి ప్రేక్షకులు కూడా కారణమే' అని చెప్పింది.