Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-టీ20 వరల్డ్కప్ భవితవ్యంపై ఉత్కంఠ
దుబారు : ఆతిథ్య క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఈ ఏడాది (అక్టోబర్-నవంబర్) టీ20 వరల్డ్కప్ నిర్వహించలేమని చేతులెత్తేసింది. కరోనా వైరస్ కష్టకాలంలో 16 దేశాల జట్లను ఓ చోటకు చేర్చి, బయో బబుల్ వాతావరణంలో మెగా ఈవెంట్ నిర్వహణ సాధ్యంకాదని ఐసీసీ కీలక కమిటీ ఫైనాన్స్, కమర్షియల్ ఎఫైర్స్ చైర్మన్ ఈషన్ మణి అభిప్రాయపడ్డారు. అయినా, టీ20 వరల్డ్కప్పై నిర్ణయాన్ని ఐసీసీ పదేపదే వాయిదా వేసింది. భారత క్రికెట్ ప్రయోజనాలను దెబ్బకొట్టడం, రానున్న ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలు పొందటం వంటి పలు అంశాలు శశాంక్ మనోహర్ను వాయిదా వైపు మొగ్గుచూపేలా చేశాయి. ఐసీసీ చైర్మన్గా శశాంక్ మనోహర్ తప్పుకోవటంతో, ఇప్పుడు టీ20 వరల్డ్కప్పై నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. తదుపరి ఐసీసీ చైర్మన్ ఎన్నిక వరకు వేచిచూస్తారా? లేక ముందే తేల్చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారంలో ఐసీసీ ఇండిపెండెంట్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఆరంభం కానుంది. గురు, శుక్రవారాల్లో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానుందని తెలుస్తోంది. ఈ భేటిలోనే టీ20 వరల్డ్కప్ నిర్ణయం వాయిదా వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే, ఐపీఎల్2020 షెడ్యూల్ అధికారికంగా పట్టాలెక్కనుంది. అక్టోబర్ 26-నవంబర్ 8తో ఐపీఎల్2020కి బీసీసీఐ తాత్కాలిక షెడ్యూల్ (అనధికారికం)రూపొందించిన సంగతి తెలిసిందే.