Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్ ప్రస్తుతం 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం విదితమే. ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రమిది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ను ఈనెల 10వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
''బాహుబలి', 'సాహౌ' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల తరువాత వస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ 20వ సినిమాపై ఇండియా వైడ్ భారీగా అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. గోపికష్ణ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గోపికష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థతో అనుబంధంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీని రాధాకష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కీలక సన్నివేశాలకి సంబంధించిన చిత్రీకరణ పూర్తయ్యింది. కోవిడ్-19 క్రైసిస్ ముగిసిన వెంటనే ఈ సినిమాకి సంబంధించి మిగిలి ఉన్న చిత్రీకరణను కంప్లీట్ చేసి పాన్ ఇండియ రేంజ్లో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి నిర్మాతలు వంశీ, ప్రమోద్, ప్రసీదలు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన అధికారిక ప్రకటనతో పాటు ఫస్ట్ లుక్ను ఈనెల10న ఉదయం 10 గంటలకు విడుదల చెయ్యబోతున్నారు. ప్రభాస్తో తొలిసారిగా పూజా హెగ్డే
ఈ సినిమాలో నటిస్తోంది. ప్రముఖ విఎఫ్ఎక్స్ టెక్నీషియన్ కమల్ కన్నన్ ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ విభాగంలో పని చేస్తుండటం
విశేషం' అని చిత్ర బృందం తెలిపింది.
ప్రభాస్, పూజా హెగ్డే నాయకానాయికలుగా నటిస్తున్న
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రొడక్షన్ డిజైనర్ : రవీందర్,
సమర్పణ : యు.వి. కష్ణంరాజు, బ్యానర్ : యూవీ క్రియేషన్స్, నిర్మాతలు: వంశీ - ప్రమోద్ - ప్రసీద, దర్శకుడు :
కె.కె. రాధాకష్ణ కుమార్.
5 కోట్ల హాస్పిటల్ సెట్?
ఈ సినిమా కోసం 5 కోట్ల విలువ గల 1980 కాలం నాటి హాస్పిటల్ సెట్ను వేసినట్టు సమాచారం. ఓ షెడ్యూల్ను జార్జియాలో చేయాల్సి ఉండగా, కరోనా కారణంగా నిలిచిపోయింది. దీంతో ప్రస్తుతం అక్కడికి వెళ్ళలేని కారణంగా చిత్ర బృందం విదేశీ వాతావరణాన్ని ప్రతి బింబిస్తూ ఆస్పత్రి సెట్ను వేసినట్టు తెలుస్తోంది.