Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏదో ఒక సినిమాలో స్పెషల్ సాంగ్ చేసినంత మాత్రాన ఇకపై కూడా అలాంటి సాంగ్స్లో నేను నటిస్తానని మీకు మీరే అనుకుంటే సరిపోతుందా?, ఇకపై నేను ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ సాంగ్స్లో నటించను' అని ఇటీవల ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ ద్వారా కథానాయిక పాయల్ రాజ్ఫుత్ స్పెషల్ సాంగ్స్పై క్లారిటీ ఇచ్చింది. అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న 'పుష్ప' సినిమాతోపాటు కమల్హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న 'ఇండియన్ 2'లోనూ పాయల్ స్పెషల్ సాంగ్స్లో మెరవబోతున్నట్టు సోషల్ మీడియాలో పలు వార్తలు హల్చల్ చేశాయి. దీంతో వీటికి క్లారిటీ ఇవ్వడంతోపాటు భవిష్యత్లో ప్రభాస్, విజరు దేవరకొండల సరసన నటించాలన్నది తన డ్రీమ్ అని చెప్పింది. అలాగే రమ్యకృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని కూడా పేర్కొంది. తేజ దర్శకత్వంలో రూపొందిన 'సీత' సినిమాలో పాయల్
ఓ స్పెషల్ సాంగ్లో నటించిన విషయం విదితమే.