Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి 'రాధేశ్యామ్' అనే టైటిల్ను ఖరారు చేస్తూ చిత్ర బృందం శుక్రవారం ఫస్ట్లుక్ని రిలీజ్ చేసింది. 'బాహుబలి1', 'బాహుబలి2', 'సాహౌ' వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ని సొంతం చేసుకున్న ప్రభాస్ తన 20వ చిత్రాన్ని 'జిల్' చిత్ర దర్శకుడు రాధాకష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. కష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రశీదలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్నో సూపర్హిట్స్ అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థలు గోపికష్ణ మూవీస్, యూవి క్రియేషన్స్ బ్యానర్స్పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఇప్పటికే యూరప్లో కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుని 70% టాకీ పార్ట్ని పూర్తి చేసుకుంది. మిగిలిన చిత్రీకరణ పార్ట్ని ఈ కొవిడ్-19 క్రైసిస్ ప్రభావం ముగిసిన వెంటనే సెట్స్ మీదకి తీసుకెళ్ళబోతున్నారు. ఇక ఫస్ట్లుక్ విషయానికొస్తే, ప్రభాస్, పూజాహెగ్డేలతో బార్బిడాల్ డాన్స్ పోజ్తో రిలీజ్ చేసిన మెదటి లుక్ చాలా అందంగా ఉండటం అందర్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రభాస్, పూజా ఇద్దరూ ప్రేమకి ప్రతిరూపంగా ఉండటం. ఎర్రటి సముద్రాన్ని గౌనుగా వాడటంలో దర్శకుడి క్రియేటివిటీ కనిపిస్తోంది. ప్రేమని చూపిస్తూ దాని వెనక సమస్యని కూడా ఈ పోస్టర్లో చూపించారు. 'బాహుబలి' రెండు పార్ట్ల తర్వాత ప్రభాస్ పాన్ ఇండియాస్టార్గా ఎదిగారు. అంతే కాదు సౌత్ ఇండియాలో మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్గా ప్రభాస్ రికార్డ్ సాధించారు. ఆ తరువాత వచ్చిన 'సాహౌ' రెవెన్యూ పరంగా బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ సత్తా మరోసారి చాటింది. అలాగే 'జిల్' చిత్రంతో దర్శకుడుగా 100 మార్క్లు వేసుకున్న దర్శకుడు రాధాకృష్ణ కుమార్. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఢిఫరెంట్ లవ్ స్టోరిగా తెరకెక్కుతోంది. మేకర్గా మంచి గుర్తింపు పొందిన రాధాకష్ణ కుమార్ రూపొందిస్తున్న రెండవ చిత్రమిది. ఈ క్రేజి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. రెబల్స్టార్ కష్ణంరాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. గోపికష్ణ మూవీస్ బ్యానర్లో పలు విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు.
మంచి కథాబలం ఉన్న చిత్రాలు నిర్మిస్తూ సక్సెస్కి కేరాఫ్ అడ్రాస్గా నిలిచిన గోపికష్ణ మూవీస్ బ్యానర్ ఇప్పడు లేటెస్ట్ సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ యూవి క్రియేషన్స్ బ్యానర్తో కలిసి నిర్మాణం చేపట్టడంతో ఈ సినిమా ట్రేడ్లో ట్రెండ్ సెట్ట్టింగ్ ఫిల్మ్గా క్రేజ్ని సొంతం చేసుకుంది. అలాగే 'రాధేశ్యామ్' అనే టైటిల్ని ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ని చూసి పెట్టారా అని అనుకునేలా ఫస్ట్లుక్లో ఈ జంట ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ఈ సినిమా తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది' అని చిత్ర బృందం తెలిపింది.