Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాహుబలి'తో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుండి మన టాలీవుడ్ హీరోలందరూ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో యువ కథానాయకుడు ఆది సాయికుమార్ కూడా ఓ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఒక సిరీస్లా చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తుండటం విశేషం.
'డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఆది సాయికుమార్ ఈ పాన్ ఇండియా చిత్రం తనకు పెద్ద బ్రేక్ అవుతుందని భావిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఫాంటసీ ఎలిమెంట్స్, వి.ఎఫ్.ఎక్స్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. యస్.వి.ఆర్ ప్రొడక్షన్స్ ప్రై.లి బ్యానర్పై నూతన దర్శకుడు బలవీర్.యస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని యస్.వి.ఆర్ నిర్మిస్తున్నారు. ఇది వరకు ఆది సాయికుమార్ చేసిన చిత్రాలకు భిన్నంగా కామిక్ టచ్తో సాగే చిత్రమిది. మేకర్స్ రెండేళ్ల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్పై దష్టి పెట్టారు. పక్కాగా అందరినీ ఆకట్టుకునేలా స్క్రిప్ట్ను రూపొందించారు. ఈ పాన్ ఇండియా సిరీస్లో చాప్టర్1 త్వరలోనే ప్రారంభం కానుంది' అని చిత్ర బృందం తెలిపింది.