Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ రచయిత్రి అర్చనా శరత్ రాసిన 'బర్డ్స్ ఆఫ్ ప్రే' పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఓ వెబ్ సిరీస్ను రూపొందించారు. సీనియర్ కథానాయకుడు శరత్కుమార్ ముఖ్య పాత్రధారిగా రూపొందిన ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన ఫస్ట్లుక్ను శరత్కుమార్ 66వ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ వెబ్సిరీస్తో ఆయన బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర కాబోతున్నారు. పిల్లలపై జరిగే అత్యాచారాల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. వాస్తవ సంఘటనలను కూడా ఇందులో చూపించ బోతున్నారని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్కి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.