Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ కథానాయకుడు కమల్హాసన్ ఇద్దరు కూతుళ్ళు శృతిహాసన్, అక్షర హాసన్ ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. వీరిద్దరూ సిల్వన్ స్క్రీన్ని షేర్ చేసుకోవడానికి రంగం సిద్ధమైందని సమాచారం.
హాలీవుడ్లో విశేష ప్రేక్షకాదరణ పొందిన హర్రర్ సినిమా 'డోన్ట్ బ్రీత్'. ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చెయ్యడానికి కమల్హాసన్ తన సొంత సంస్థ రాజ్కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్పై నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రాజేష్.ఎం.సెల్వన్ దర్శకత్వం వహించ బోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం న్యూజిలాండ్లో జరుగనుందని తెలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకతను శృతిహాసన్ సొంతం చేసుకుంటే, తమిళం, హిందీ భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అక్షర్ హాసన్ ఇంకా నిలదొక్కుకునే ప్రయత్నంలోనే ఉంది. ఇదిలా ఉంటే, శృతిహాసన్ ప్రస్తుతం రవితేజతో 'క్రాక్' చిత్రంలో నటించింది. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అవ్వనున్నట్టు తెలుస్తోంది.