Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అర్జున్, శంకర్ కాంబినేషన్లో రూపొందిన సినిమా 'ఒకే ఒక్కడు' (తమిళంలో 'ముదల్ ఒన్'). విశేష ప్రేక్షకాదరణతో ఈ సినిమా అటు తమిళంలోను, ఇటు తెలుగులోనూ అఖండ విజయం సాధించింది. అలాగే విమర్శకుల ప్రశంసలూ పొందింది. ఒక్క రోజు ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్తో దర్శకుడు శంకర్ రూపొందించిన ఈ చిత్రానికి యావత్ ప్రేక్షకలోకం ఫిదా అయిపోయింది. ఇక రాజకీయ వర్గాల్లో అయితే పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. సామాన్య ప్రజానీకమైతే ఇలాంటి ఒక్క రోజు సీఎం ఉంటే మన సమస్యలన్ని పరిష్కారం అయ్యేవనుకునేలా చేసిందీ సినిమా. మన నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలనే కథా వస్తువుగా తీసుకుని శంకర్ వెండితెరపై ఆవిష్కరించిన తీరు, అలాగే ప్రజల సమస్యలను ఒక్క రోజు సీఎంగా ఉన్న కథానాయకుడు పరిష్కరించిన వైనం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాదు ఆలోచించేలా కూడా చేసింది. 1999లో విడుదలై సంచలన విజయం సాధించిన ఈ సినిమాకి సీక్వెల్ చేసే యోచనలో దర్శకుడు శంకర్ ఉన్నారు. లాక్డౌన్ పీరియడ్లో దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ని శంకర్ పూర్తి చేశారట. అంతేకాదు అగ్రకథానాయకుడు విజరుకి కథ నెరెట్ చేయగానే మరోమారు ఆలోచించకుండా సినిమాకి గ్రీన్సిగల్ ఇచ్చారని సమాచారం. శంకర్ ప్రస్తుతం కమల్హాసన్తో కలిసి 'ఇండియన్ 2'ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇది కూడా దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన 'ఇండియన్' చిత్రానికి సీక్వెల్ కావడం విశేషం. అలాగే విజరు నటించిన 'మాస్టర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీగా ఉంది.