Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కమ్మేసింది. కులం, మతం, వర్గం, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కాటేస్తోంది. ఈ మహమ్మారి విలయ తాండవానికి రోజుకు వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేసి కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కరోన చావులు దాచి నిజాన్ని సమాధి చేస్తోంది. రోజువారీగా ప్రభుత్వం విడుదల చేసే బులిటెన్లో కరోనా మరణాల సంఖ్య పదులు దాటడం లేదు. కానీ హైదరాబాద్ లాంటి మహానగరంలో రోజుకు 50 నుంచి 60 మంది చనిపోతున్నారని మీడియా వెలికితీసింది. కరోనా మరణాల సంఖ్య ఎందుకు దాస్తున్నారు? ఏ ప్రయోజనం దాగి ఉందో అర్థం కావడం లేదు. వైద్యులు, వైద్య నిపుణులు ఇప్పటికే రాష్ట్రంలో లక్షలాది మందికి కరోనా వైరస్ సోకి ఉంటుందని బాహాటంగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోన టెస్టులు పెంచి, రోగులను గుర్తించి వైరస్ వ్యాప్తిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. గ్రామాల్లో కూడా రోజువారీగా పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ కట్టడిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ఉదర కొట్టిన ప్రభుత్వ పెద్దలు, ఇప్పుడు ఎందుకు మీడియా ముందుకు రావడం రావడం లేదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నిజాలు నిస్సిగ్గుగా ప్రజలకు చెప్పి వారిని జాగ్రత్త చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పై ఉంది. లేకపోతే మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, దాటి కరోనా కేసుల సంఖ్యలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవడం కాయంగా కనిపిస్తోంది.
-బి. రాకేష్