Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజు రోజుకు కరోనా వైరస్ ప్రభావం వల్ల చాలామందికి పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ వస్తున్న వారి సంఖ్య ఘననీయంగా పెరిగిపోతుంది. కేసులు తక్కువగా ఉన్నప్పుడు లాక్డౌన్ విధించి ఎవరూ బయటకు రాకుండా చూశారు. ఇప్పుడు రోజు రోజుకు కేసులు పెరిగిపోతుంటే ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రజా ఆరోగ్యంతో ఆటలు ఆడుతోంది. రోజు రోజుకూ కేసులు బాగా పెరిగిపోతుంటే ప్రజలలో భయాందోళనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కేసులు తక్కువగా ఉన్నప్పుడు అనుమానితులను క్వారంటైన్లో ఉంచేవారు. ప్రస్తుతం క్వారంటైన్ సెంటర్లను మొత్తానికే ఎత్తివేశారు. కరోనా కేసులు పెరగకుండా ప్రభుత్వం ఉక్కుపాదం మోపవలసిన అవసరం ఉంది. ప్రజా ఆరోగ్యం మరింత ఆందోళనలో పడకముందే ప్రభుత్వం మేల్కొని కేసుల ఉధృతి తగ్గించేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నారు.
షేక్ అస్లాంషరీఫ్, శాంతినగర్.