Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చరిత్రలో రాణుల సౌంద ర్యాన్ని, రాజుల వైభవాన్ని వివరించిన కవులున్నారు. కానీ తాడిత, పీడిత వర్గాల వారి బాధల గురించి రాసిన కవులు కొందరే ఉన్నారు. అటువంటి వారిలో రావిశాస్త్రి ఒకరు. రాచకొండ విశ్వనాధశాస్త్రి 1922 జూలై 30న జన్మంచారు. ఈయన వత్తి రీత్యా న్యాయవాది. రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన, కథల్లో కూడా న్యాయవాదే. నేటి సమాజంలో నిత్యమూ పై తరగతులవారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకుని సాంఘిక (ఆర్థిక)న్యాయం కోసం ''వాదించాడు''. సమాజం అట్టడుగు పొరల్లో, అనుక్షణం భయపడుతూ జీవించే అథోజగత్సహొదరుల సమస్యలను, వాటివలన కలిగే దుఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి ప్రజా జీవితం పట్ల పాఠకుల సానుభూతి ''పిండ'' గల ప్రతిభావంతుడు అతడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో, సొగసుగా, ప్రతిభావంతంగా, పాఠకుల హదయాలకు హత్తుకు పోయేలా పదునైన రచనలు చేసాడు.
1983లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళాప్రపూర్ణను ప్రకటిస్తే దానిని తిరస్కరించాడు. 1966లో తీసుకున్న సాహిత్య అకాడమీ అవార్డును కూడా తిరిగి ఇచ్చివేసాడు. ఆయన కథకుడే కాదు నటుడు కూడా. ఆయన రాసిన నిజం నాటకంలోను, గురజాడ కన్యాశుల్కం నాటకంలోను నటించాడు. నిజం నాటకం ఆరోజుల్లోనే, అంటే 1962 ప్రాంతంలో, వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన, ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎన్నదగినది. జేమస్ జాయిస్ ''చైతన్య స్రవంతి'' ధోరణిలో వచ్చిన మొదటి తెలుగు నవల ఇది. జేమస్ జాయిస్ రచనా పద్థతిని మొదటిసారిగా తెలుగు కథలకు అన్వయించినది కూడా రావిశాస్త్రే. ఇది ఆయన మొట్టమొదటి నవల.
ఈ నవలను ఆయన 1952లో రచించాడు. తరువాత రాజు మహిషీ,రత్తాలు-రాంబాబు అనే రెండు అసంపూర్ణ నవలల్ని రచించిచాడు. ఈయన జీవిత చరమాంకంలో ఇల్లు అనే నవలను రచించాడు. అయితే ఈయన రచించిన నవలల్లోకెల్లా ఈ అల్పజీవి నవలనే ఉత్తమమైన నవలగా విమర్శకులు భావించారు. ఆయన నవలల్లోకెల్లా అత్యధిక ప్రజాదరణ పొందిన నవల కూడా ఇదే. ఆంధ్రలో మద్యపాన నిషేధ చట్టం తెచ్చిపెట్టిన అనేక విపరిణామాలను చిత్రిస్తూ ఆయన అద్భుతంగా రాసిన ఆరుసారా కథలు తెలుగు కథా సాహిత్యంలో ఒక విప్లవాన్ని సష్టించి అందరిని ఆలోచింపచేసాయి. అధికార గర్వానికి ధనమదం తోడైతే పై వర్గం వారు ఎటువంటి దుర్మార్గాలు చేయగలరో ఆయన నిజం నాటకంలో వ్యక్తం చేసాడు. ఆయన 1993 నవంబర్ 10న మరణించారు. రాజ్యాంగం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దని చెప్తుంది. నేటి కరోనా కాలంలో పాలకులకి మద్యమే పెద్ద దిక్కయ్యింది. సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయడమే రావశాస్త్రి కిచ్చే నిజమైన నివాళి.
యం. రాం ప్రదీప్
సెల్:9492712836