Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువత ఆన్లైన్ గేమ్లకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును చేజేతులా పాడుచేసుకుంటున్నారు. ఎందుకంటే ఇవి కూడా జూదం లాంటివే. యువత బలహీనతలను ఆసరాగా చేసుకొని కొన్ని కంపెనీలు, సంస్థలు రమ్మీ, పబ్ జీ లాంటి గేమ్లు ఆడితే అవలీలగా డబ్బు సంపాదించొచ్చని పదే పదే పబ్లిసిటీ ఇస్తున్నాయి. ఈ బుట్టలో పడి కొంతమంది యువత లక్షలాది రూపాయలు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ లాక్డౌన్ కాలంలో ఏ పని పాట లేని యువత పోలీసుల కన్నుగప్పి అదే పనిగా జూదం, మట్కా ఆడుతూ తమ కుటుంబాలను కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. - బుగ్గన మధుసూదన రెడ్డి