Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మద్యన కోడిగుడ్డు మీద ఈకలు పీకేవారు ఎక్కువవుతున్నారు. ఒక మంచి పనిని మంచి అనీ, ఒక గొప్పతనాన్ని గొప్ప అనీ ఒప్పుకోవడానికి వారికి అహం, అసూయ అడ్డొస్తున్నది. ఈ పరిణామం సమాజానికి మంచిది కాదు. తాజాగా సినీ నటుడు సోనూసుద్ ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు కుటుంబాలకు అతను చేసిన సహాయానికి తోచిన లెక్కలు వేస్తూ తమ అక్కసును వెల్లగక్కుతున్నారు. ఏ స్వార్థం లేకుండా ఎందుకు సహాయం చేస్తారని కొందరంటే, త్వరలో రాజకీయీల్లోకి వస్తున్నందుకే ఈ సహాయాలని మరి కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దాతృత్వానికి కూడా విపరీతార్థాలు తీసే సమాజంలో చేసే మంచి పనికి ఇంతకంటే ఏం విలువుంటది. లాక్డౌన్ కాలంలో బాషా, ప్రాంతంతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన దాదాపు మూడు లక్షల మంది వలస కార్మికులను స్వంత ఖర్చులతో స్వస్థలాలకు పంపించారు సోనూసూద్. అప్పుడు రాని అపోహలు ఇప్పుడెందుకు వస్తున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఉంది.. ఇతరులు తమను దాటేసి పోకూడదనే స్వార్థం పక్కవారు మంచి పని చేసినా కాలు పట్టి లాగే వరకు వెలుతున్నది. తాము చేయరూ మరోకరు చేస్తే సహించరు. ఈ ధోరణి మరాల్సిన అవసరం ఉంది. మంచి పని ఎవరు చేసినా నిండు మనుసుతో ఆహ్వనించాల్సిన అ వసరం ఉంది. - ఊరగొండ మల్లేశం