Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలో సినిమా పరిశ్రమను చుట్టుముడుతోంది డ్రగ్స్ మాఫియా. ఈ డ్రగ్స్ మాఫియాకు సుశాంత్ సింగ్ రాజ్ఫుట్ బలయ్యాడు. అలాగే కర్నాటకలోనూ నేడు మాఫియా కోరలు చాచుతోంది. కొందరు సిని పరిశ్రమకు చెందిన నటులు, సెలబ్రిటీలు ఇందులో పాలు పంచుకుటున్నారు. మొన్నటికి మొన్న టాలీవుడ్నూ ఇది కుదిపేసింది. అది మరవక ముందే మళ్ళీ కొత్తగా వెలుగులోకి వస్తోంది. ధనికుల పిల్లలకు మత్తు పదార్థాలను ఎరగా వేసి లక్షలు లక్షలు దండుకుంటున్నారు. ఇతర దేశాలను అడ్డాగా చేసుకుని భారత్ కేంద్రంగా డ్రగ్స్ను విక్రయిస్తున్నారు. గతంలోసైతం నైజీరియా, ఇతర దేశస్తులు పట్టుబడ్డారు. పట్టుబడుతూనే ఉన్నారు. డ్రగ్స్ మాఫియాను కూకటివేళ్ళతో పెకిలించిన నాడే దీనికి అంతం. డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్న వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి. అవసరమైనవారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తే దీనిని నివారించడం పెద్ద కష్టం కాదు. కానీ ఎందుకో ఈ ఉదాసీనత అర్థం కాదు..!
- ఎ.ఆర్.ఆర్.రావు, ఖమ్మం.