Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రామపంచాయతీ మొదలుకొని రాష్ట్ర వ్యాపితంగా అన్ని ప్రాంతాల్లోని అక్రమ లే అవుట్లు, అందులోని ప్లాట్ల క్రమబద్దీకరణకు 2020 ఆగస్ట్ 31న జీవోఎంఎస్ నెం.131 ద్వారా ''లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్-ఎల్ఆర్ఎస్''ను టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్రంలో 22,076 ఎకరాల్లో 3,892 అక్రమ వెంచర్లలో 2,81,171 ప్లాట్లు ఉన్నట్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన పట్టణ ప్రగతి సర్వేలో ప్రభుత్వం గుర్తించింది. గ్రామ పంచాయతీల్లో ఎన్ని లేఅవుట్లున్నాయో మాత్రం లెక్కలు లేవు. ఇలాంటి అక్రమ వెంచర్లలో 2020 ఆగస్ట్ 26లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లన్నింటీకీ 2020 అక్టోబర్ 25లోపు కచ్చితంగా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకుని, 2021 జనవరి 31లోపు పూర్తి ఫీజు చెల్లించాల్సిందేనని, లేనిపక్షంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న సేల్డీడ్ చెల్లుబాటు కాదని, ఆ ప్రాపర్టీలో క్రయవిక్రయాలు జరగవని, అందులో ఇల్లు కట్టుకోవడానికి, బ్యాంక్లోన్ తీసుకోవడానికి అవకాశం ఉండదని, వాటర్, విద్యుత్, రోడ్లు తదితర కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించబోదమీ జీవో హెచ్చరించింది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్లలను పూర్తిగా నిలిపివేసి ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఈ లే అవుట్లల్లో ప్లాట్లు కొనుక్కున్న పేద, మధ్యతరగతి ఆందోళనకు గురవుతున్నారు. లే అవుట్ రెగ్యులరైజేషన్కు రూ.10వేలు, ప్లాట్ ఓనర్ రెగ్యులైరైజేషన్ చార్జీలు రూ.1000లు మీసేవా, సిటిజెన్ సర్వీస్ సెంటర్లు, కామన్ వెబ్ పోర్టల్తో పాటు, ప్రత్యేకంగా తయారు చేసిన మొబైల్ యాప్లో ఉపయోగించుకుని దరఖాస్తు చేసుకోవాలని జీఓ పేర్కొన్నది. సేల్డీడ్ రెండువైపుల జిరాక్స్, ఈసీతో, 2020 ఆగస్ట్ 26 నాటి మార్కెట్ విలువ సర్టిఫికేట్, ప్లాట్ యొక్క లే అవుట్ కాపీతో పాటు, లైసెన్స్ ఇంజనీర్ వేసిన లొకేషన్ మ్యాప్పై అతని స్టాంప్ సంతకం చేయించి, ప్లాట్ ఓనర్ సంతకం చేయాలి. ఈ డాక్యుమెంట్లన్నింటిపై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించాలి. ఆ ప్లాట్ ఎటువంటి వివాదాల్లో లేదంటూ, అది ఎఫ్టిఎల్లో, సీలింగ్, దేవాదాయ శాఖలో లేదంటూ, భవిష్యత్లో ఏదైనా జరిగితే ఎచ్ఎండీఏ, సంబంధిత అథారిటీది బాధ్యత కాదనే అంశాన్ని పేర్కొంటూ ఇండెమ్నిటీ బాండ్ రూ.100ల స్టాంప్ పేపర్పై నోటరీ చేయించాలి. వీటికి తోడు జీయోకోయర్నేట్ను తీసుకోవాలి. వీటన్నింటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. గతంలో హెచ్ఎండీఏ, మున్సిపాలిటీల పరిధికే పరిమితమైన ఈ స్కీమ్ ప్రస్తుతం 131 జీవో ద్వారా గ్రామ పంచాయతీలతో సహా రాష్ట్రమంతా వర్తించేట్టు చేసి ప్రభుత్వం తన ఖజానాను నింపుకోవాలని చూస్తున్నది.
జీవో 131 ద్వారా గతం కంటే ఎక్కువ చార్జీలు విపరీతంగా పెంచింది. 1. బేసిక్ రెగ్యులరైజేషన్ చార్జీలు 2. ఓపెన్ ప్లేస్ చార్జీలు 14శాతం 3. నాలా చార్జీలు 4.5 శాతం 4. పెనాలిటలీ 20శాతం చెల్లించాలని జీవో పేర్కొన్నది.
ప్రస్తుత 131 జీవోలో పేర్కొన్న లెక్కలు సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో లేవు. బేసిక్ రెగ్యులరైజేషన్ ప్రకారం 100 మీటర్ల లోపు స్థలానికి మీటర్కు రూ.200లు చార్జీ వసూలు చేయాలని, కానీ రెండవ స్థాయిలో మార్కెట్ విలువ రూ.3000లు ఉంటే అప్పుడు ఆ బేసిక్ రెగ్యులరైజేషన్ చార్జీల్లో గజానికి 25శాతం వసూలు చేయాలని జీవో పేర్కొన్నది. ఇది ప్రజలను తికమక్క పెట్టడమే.
టేబుల్-1లో ప్లాట్ యొక్క విస్థీర్ణాన్ని బట్టి స్లాబ్రేటు పేర్కొనబడింది. బేసిక్ రెగ్యులరైజేషన్ చార్జీలు స్కైర్ మీటర్లల్లో ఇచ్చారు. 100 స్కైర్ మీటర్ల లోపుంటే ఒక్కో స్కైర్ మీటర్కు రూ.200లు, 201-300 స్క్వైర్ మీటర్లు ఉంటే స్వైర్ మీటర్కు రూ.400, 301 నుంచి 500లు స్క్వైర్ మీటర్లు ఉంటే ఒక్కో స్క్వైర్ మీటర్కు రూ.600లు, 500లకు పైగా స్వైర్ మీటర్లుంటే స్క్వైర్ మీటర్కు రూ.750లు చొప్పున లెక్కల్లోకి తీసుకోవాలి. స్లమ్ ఏరియాల్లో స్క్వైర్ మీటర్కు రూ.5లుగా పేర్కొనగా, ఆ కనీస ఛార్జీలు కూడా చెల్లించే స్థితిలో జనం లేరు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో మార్కెట్ విలువను గజాల్లో చూపిస్తున్నందున జీవోలోని టేబుల్-2లో కూడా గజాల్లో చూపించారు. 2020 ఆగస్ట్ 26 నాటికి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం ఒక్కో గజం విలువ రూ.3000లోపు ఉంటే టేబుల్-1లో ఎన్ని స్క్వైర్ మీటర్లకు ఎంతమొత్తం ఛార్జీ చేయాలని పేర్కొన్న మొత్తం అమౌంట్లో 25శాతం ఫీజు కట్టాలి. ఇది బేసిక్గా రెగ్యులరైజేషన్ ఫీజుగా పేర్కొన్నారు. రూ.3001-5000 (50శాతం), రూ.5001-10000 వరకు (75శాతం), రూ.10001లు ఆపైన ఉంటే (100శాతం) చెల్లించాలని పేర్కొన్నారు. కానీ ప్లాట్ల యజమానులకు ఎప్పటి వరకు ఎల్ఆర్ఎస్ ప్రోసిడింగ్స్ను అందజేస్తారో జీవోలో పేర్కొనలేదు.
గజానికి రూ.600లు మార్కెట్ విలువ ఉన్న 200 చదరపు గజాల (167.225 స్కైవర్ మీటర్స్) ప్లాటుకయ్యే ఛార్జీలు పరిశీలిస్తే 1. బేసిక్ రెగ్యులరైజేషన్ చార్జీ 167.225 స్వైర్ మీటర్లు × రూ.400=రూ..66,890 2. 2వ టేబుల్ 200 గజాల ప్లాటు (గజం మార్కెట్ విలువ రూ.600 స్లాబ్లో ఉన్నందున) 25శాతం బేసిక్ చార్జీలు 66,890×25శాతం =రూ.16722 3. లేఅవుట్లో 10శాతం ఓపెన్ ప్లేస్ లేకపోతే 2020 ఆగస్ట్ 26 నాటి ప్లాట్ మార్కెట్ విలువ (రూ.600×200 గజాలు = ప్లాట్ విలువ 1,20,000)లో 14శాతం = 16,840 (4) అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లోకి మార్చడానికి (నాలా) చార్జీలు 3శాతమే కానీ, 1.5 శాతాన్ని లేట్ ఫీజు క్రింద వేస్తూ మొత్తం కలిపి 4.5శాతం (1,20000వేలు× 4.5శాతం) 5400. (5) బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జీలు రూ.16,722 + ఓపెన్స్పేస్ ఛార్జీలు రూ.16,840 (రూ.38,932) ఈ రెండింటి మీద 20శాతం అంటే రూ.7,786లు పెనాలిటీ వేస్తున్నారు. ఇది ఎందుకు వేస్తున్నారో పేర్కొనలేదు. ఇవ్వన్నీ కలిపితే మొత్తం రూ.46,718లు అవుతుంది. అప్లరు చేసుకోవడానికి డాక్యుమెంట్స్, ఇతరత్రా ఖర్చు మరో నాలుగైదువేలు అదనంగా అవుతుంది. అదే విధంగా ఈ లెక్కన గజం రూ.8000లు మార్కెట్ విలువ ఉన్న 200 గజాల ప్లాటుకు ఈ రోజు రూ.3,96,322లు చెల్లించాల్సి వస్తోంది. ఎందుకంటే రూ.8,000 ఉన్నదానికి గతంలో బేసిక్ విలువలో కేవలం 40శాతముండగా. ఈ జీవో ద్వారా ప్రస్తుతం అది 75శాతాం అయ్యింది, అంటే 35శాతం అదనం. ఈ రుసుం మొత్తం చెల్లించినా ప్రభుత్వం కొత్తగా వసతులు కల్పించేదేమీ లేదు. ప్రస్తుతమున్న 20 ఫీట్ల రోడ్డుకు బదులు 30 ఫీట్ల రోడ్డు ఉండాలనుకుంటే ఇళ్లు కూలగొట్టి అదనపు రోడ్డు వేయలేరు. 10శాతం ఓపెన్ప్లేస్ లేని దగ్గర కొత్తగా ఆ భూమిని అదనంగా చూపలేరు. కానీ ఈ పేరుతో ప్రభుత్వం ప్రజల దగ్గర ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నది. గతంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తేదీని లెక్కల్లో తీసుకుని ఎల్ఆర్ఎస్, నాలా ఫీజులు వసూలు చేసేవారు. కానీ ప్రస్తుతం 70ఏండ్ల క్రింద తీసుకున్న ప్లాటుకు కూడా 2020 ఆగస్టు 26 నాటి మార్కెట్ విలువను లెక్కల్లోకి తీసుకోవడం ఘోరం. ప్రభుత్వం విడుదల చేసిన జీఓలోని రేట్లను పరిశీలిస్తే అప్పుడు ప్లాటు కొనుగోలు చేసిన రేటుకంటే ప్రస్తుతం చెల్లిస్తున్న ఫీజులే రెట్టింపుగా ఉన్నవి. ప్రభుత్వాలు చేసిన తప్పుకు నేడు ప్రజలను బలిచేస్తున్నారు.
టేబుల్-1 కనీస క్రమబద్ధీకరణ చార్జీలు
ప్లాట్ ఏరియా 2020 జీవో 131 ప్రకారం కనీస (స్వైర్ మీటర్లు) క్రమబద్ధీకరణ చార్జీలు
(స్వైర్ మీటర్కు)రూ.లు
100 లోపు 200
101-300 400
301-500 600
500లకు పైన 750
స్లమ్ ఏరియాలో 5
(ప్లాటు ఏరియా భూమి విలువతో
సంబంధం లేకుండా అన్నింటికీ)
టేబుల్ -2 భూమి విలువతో క్రమబద్ధీకరణ
26.8.2020 నాటి మార్కెట్ విలువ క్రమబద్ధీకరణ చార్జీలు క్రమబద్ధీకరణ చార్జీలు
ఆధారంగా (చ.గజాలు) 2020 జీవో 131 ప్రకారం 2015 జీవో 151 ప్రకారం
3000 వరకు 25శాతం 20 శాతం
3001-5000 50శాతం 30శాతం
5001-10000 75శాతం 40శాతం
10001-20000 100 శాతం 50 శాతం
20001-30000 60శాతం
30001- 50000 80శాతం
50000 పైన 100శాతం
- నాగటి రవీంద్ర
సెల్: 9490099149