Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశాన్ని గూర్చి రెండు వార్తా కథనాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మొదటిది, గత త్రైమాసికంలో జీడీపీ 24శాతం పతనం కావడం. రెండవది, భారతదేశం అసాధారణ రీతిలో ప్రపంచ అంటువ్యాధుల జాబితాలో అమెరికాను కూడా మించి పోవడం. రెండవ త్రైమాసికంలో 24శాతం పతనం కావడమంటే, ఆ త్రైమాసికంలో ప్రపంచంలోనే అత్యంత గరిష్టమైన పతనంగా నమోదు అయినట్టు. ఇదే త్రైమాసికంలో పోలిస్తే అమెరికా 9.5, జపాన్ 7.6శాతంగా ఉన్నాయి. చైనా విషయానికి వస్తే తన జీడీపీలో 6.8శాతానికి పడిపోయి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అది 3.2శాతం అభివృద్ధిని నమోదు చేసుకొని, కరోనా మహమ్మారిని కూడా వెనక్కి నెట్టివేసింది. ఇతర దేశాల వలె కాకుండా భారత ఆర్థిక వ్యవస్థ కరోనా వ్యాప్తికి ముందే మందగించింది. కాబట్టి కరోనా మహమ్మారి, బలహీనపడిన ఆర్థిక వ్యవస్థలపైన రెట్టింపు ప్రభావం చూపింది. భారతదేశ జీడీపీ పతనం చాలా గరిష్ఠంగా ఉంది. అసంఘటితరంగ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న తీవ్రమైన దెబ్బలను ప్రభుత్వం గమనంలోకి తీసుకోలేదు. జీడీపీ గణాంకాలను చూపించలేదు. ఆ గణాంకాలను కూడా అంచనా వేసినట్టైతే, నిజ జీడీపీ పతనం మరింత ఎక్కువగా ఉండేది.
కరోనా వైరస్ వ్యాప్తిలో భారతదేశంలో నమోదైన సంఖ్యలు అస్పష్టంగా ఉన్నాయి. ఆగస్ట్ నెలలో నమోదైన మొత్తం కేసులను పరిశీలిస్తే అవి అమెరికా కంటే అధికంగా ఉన్నాయి. భారతదేశంలో రోజుకు 78వేలకు మించిన కేసులను నమోదు చేసి నూతన రికార్డు సష్టించింది. రోజువారీ కేసుల్లో కొంత మేరకు తగ్గుదల కనిపించినా, అది కూడా ఇంకా ఎక్కువగానే ఉంటుంది. కరోనా వైరస్ రెండింతల పెరుగుదలను బట్టి దాని విస్తతిని అంచనా వేయవచ్చు. ఎన్ని రోజుల్లో పాజిటివ్ కేసులు రెట్టింపు అయ్యాయనే దాన్ని బట్టి అంచనా వేయవచ్చు. భారతదేశంలో ప్రాథమికంగా 12-14 రోజుల్లో, ప్రస్తుతం 25-30 రోజుల్లో రెట్టింపు అయ్యాయి. వైరస్ బారిన పడిన అమెరికా, బ్రెజిల్, మెక్సికో లాంటి దేశాలతో పోలిస్తే భారత దేశంలో గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లే. ఆయా దేశాల్లో ప్రస్తుతం రెట్టింపు పెరుగుదల 50-60 రోజులుగా ఉంది. గణనీయంగా పెరుగుతున్న ఏ దేశాల కేసులు పరిశీలించినా, భారత దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య మిగిలిన దేశాల కన్నా రెండింతలు వేగంగా పెరుగుతున్నది.
దీనికి భిన్నంగా చైనాలో మొదటి దశలో 82000 కేసులు నమోదయ్యాయి. జనవరి- మార్చి నెలల్లో పూర్తి లాక్డౌన్ విధించారు. వైరస్ వ్యాప్తిని గుర్తించి, క్వారంటైన్ చికిత్సల తరువాత ఏప్రిల్- ఆగస్ట్ నెలల వరకు వైరస్ వ్యాప్తిని అదుపులోకి తీసుకొని రాగలిగారు. ఆ తరువాత ఈ ఐదు నెలల కాలంలో 3వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి.
అనేక మంది నిపుణులు లాక్డౌన్ వల్లే ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం సంభవిస్తుందని, లాక్డౌన్ ఎత్తివేసిన వెంటనే ఆర్థిక పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ నమ్మకంతోనే స్వీడన్ లాక్డౌన్ లేకుండా సమూహ నిరోధకశక్తి మహమ్మారిని నిరోధించడంలో ఉపకరిస్తుందని భావించింది. ఈ నమ్మకం ఆధారంగా అనేక దేశాల్లో ప్రాథమికంగా కొంత నిరోధకశక్తి కనిపించింది. యూకే వలె చైనాలో విధించిన లాక్డౌన్ ''నిరంకుశత్వంతో'' కూడినదైనందు వల్లనే అలాంటి స్పందన వచ్చిందని వాదిస్తున్నారు. ఆ పద్ధతిని ''ప్రజాస్వామ్య'' దేశాలు యధాతథంగా అనుసరించలేవని చెబుతున్నాయి. లాక్డౌన్కు, మాస్క్ల వినియోగానికి, భౌతిక దూరానికి వ్యతిరేకంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ఈ ఆలోచనా విధానమే ప్రాతిపదిక అయ్యింది. ఈ ఆలోచనా విధానానికి, సైన్స్ వ్యతిరేక ఆలోచనలే మూలమైనాయి. ఈ విధానాన్నే రాజ్య వ్యతిరేక నమ్మకాలకూ, అనేక మితవాద ధోరణులను బలపర్చడానికీ ఉపయోగించుకుంటున్నారు.
మనం ఈ ప్రశ్నను గూర్చి పరిశీలిద్దాం. అది ప్రశ్నో కాదో ఆలోచిద్దాం. మనం చెప్పిన ఆంక్షలను తొలగించి, ఆర్థిక పరిస్థితిని సాధారణ స్థితికి తేగలగడమా? లేక అంటువ్యాధిని అదుపు చేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమా? ఈ ప్రశ్నను ఈ విధంగా రూపొందించడానికి బదులుగా, ఇంకొక విధంగా కూడా చూడవచ్చు. మహమ్మారి తీవ్రమవుతున్న దశలో ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి రాగలదా?
స్వీడన్ అనుభవం చాలా స్పష్టంగా ఉంది. సామూహిక నిరోధకశక్తిపై నమ్మకంతో లాక్డౌన్ విధించలేదు. తన పొరుగు వారైన నార్డిక్ దేశాలు నార్వే, స్వీడన్తో జీడీపీ తరుగుదల ప్రజల వినియోగ స్థాయికి పోల్చదగినది. అంటే లాక్డౌన్ విధించకపోవడం ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు సహాయకారి కాలేదని అర్థం అవుతుంది. అంటువ్యాధి సోకిన వారి సంఖ్య స్వీడన్లో అధికంగానే ఉంది. నార్వే, డెన్మార్క్లతో పోలిస్తే స్వీడన్లో మిలియన్కు 8200 కేసులు నిర్ధారించబడ్డాయి. నార్వేలో 1780, డెన్మార్క్లో 2560 కేసులు నమోదయ్యాయి. స్వీడన్లో మరణాలు ఎక్కువ సంఖ్యలో సంభవించాయి. నార్వేలో 5, డెన్మార్క్లో 11 మరణాలు మాత్రమే నమోదైనాయి.
నిత్యం కొనసాగుతున్న అంటువ్యాధి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందన్న విషయం స్పష్టం. భారతదేశంలో ప్రజలు తమ ఖర్చులను తగ్గించుకోవడం లేదా వాయిదా వేసుకోవడం గానీ చేస్తున్నారు. ఈ మహమ్మారి వ్యాప్తి కారణంగా సామాజిక పరస్పర చర్యలను కూడా తగ్గించుకుంటున్నారు. కేవలం యువకులు మాత్రమే అప్పుడప్పుడు బందాలుగా గడుపుతున్నారు. మరణాల సంఖ్య అధికమైనప్పుడు ఈ సంబంధాలు కూడా పరిమితం అవుతున్నాయి. ఖర్చును వాయిదా వేసుకుంటున్నారు అంటే, వినియోగం తగ్గిందని అర్థం. దీని ఫలితంగా డిమాండ్ తగ్గి, ఉత్పత్తి మందగిస్తుంది. అందువల్ల సంఘటిత, అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాలు కోల్పోతారు. ఆ తరువాత కొనుగోలు శక్తి మరింత దిగజారుతుంది.
లాక్డౌన్ తరువాత ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ లాంటి అనేక దేశాల్లో రెండవ దఫా వైరస్ వ్యాప్తి చెందుతున్నది. అది చలికాలంలో మరింత ఉధతం కావచ్చు. వారి కార్యకలాపాలు అన్నీ ఇంటికి పరిమితం అయ్యాయి. ఇరుకు ప్రదేశాలలో పెద్దసంఖ్యలో గుమిగూడినట్లైతే వ్యాధి ఎక్కువగా వ్యాప్తిచెంది, అంటు వ్యాధులు ప్రబలడానికి దోహదపడుతుందని ఇప్పటికే స్పష్టం అయ్యింది.
ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలంటే ప్రజలను అంటువ్యాధుల బారినుండి రక్షించుకోవడమే ఏకైక మార్గం అని చైనా అనుభవం కూడా తెలియజేస్తున్నది. లాక్డౌన్ను అమలు పరచడం, కోవిడ్ నివారణా పోరాటంలో మొత్తం ప్రజానీకాన్ని భాగస్వాములను చేయడం వల్ల చైనా దాదాపు సాధారణ స్థితికి చేరుకుంది. వారి ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడం ప్రారంభమైందని చెప్పడంలో ఏ విధమైన ఆశ్చర్యం లేదు. రెండవ త్రైమాసికంలో సానుకూలమైన పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందింది.
క్యూబా, న్యూజిలాండ్, వియత్నాం లాంటి దేశాలు కూడా ఈ మహమ్మారిని అణచివేయడంలో ఈ మార్గాన్నే ఎంచుకున్నాయి. ఆర్థిక వ్యవస్థ అదుపు, మహమ్మారి అదుపుల మధ్య ఊగిసలాటలో ఉన్న దేశాల అనుభవంలో కరోనా మహమ్మారిని అదుపు చేయడమే ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఏకైక మార్గం అనే విషయం స్పష్టం అయ్యింది. ఆర్థిక వ్యవస్థను అదుపులోకి తేవాలా లేక మహమ్మారిని అదుపు చేయాలా అనే ఊగిసలాటలో ఉంటే రెండింటినీ అదుపు చేయలేము.
మనదేశంలో మోడీ ప్రభుత్వ విధానాలు కరోనా మహమ్మారిని అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైనాయి. కఠినమైన లాక్డౌన్ తరువాత అతిశయోక్తులుతో కూడిన ప్రకటనలు చేశాడు. నవీన భారతయుద్ధాన్ని 21రోజుల్లో నియంత్రణ చేస్తానని అన్నాడు. రెండుసార్లు లాక్డౌన్ను పొడిగించినాడు. మనం ప్రస్తుతం అన్ లాక్ 4వ దశలో ఉన్నాం. మొత్తం మూడు లాక్డౌన్లు, నాలుగు అన్లాక్ దశలకూ మహమ్మారి స్థితికీ ఏ విధమైన సంబంధం లేదు.
రాష్ట్రాలు ఏమి చేయాలో ఏమి చేయకూడదో అనే అంశాలను నిర్ణయించే అధికారాన్ని కేంద్రం ఇప్పటికే తన అధీనంలో ఉంచుకుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలనే రాష్ట్రాలు అనుసరించాలనే ధోరణిలో ఉంది. దీని వలన ఆరోగ్య మంత్రిత్వ శాఖ, దాని అధికారులు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారో, ఏమి జరుగుతుందో మనకు తెలియకుండా ఉంది. వారు ప్రజల దష్టి నుంచి కనుమరుగయ్యారు. అసాధారణ రీతిలో కేంద్ర హౌంశాఖ, కేంద్ర ప్రభుత్వం అధికారాలన్నింటిని కేంద్రీకతం చేయడం వల్ల ఆరోగ్య సంక్షోభం ఏర్పడింది.
ఈ లాక్డౌన్, అన్లాక్ దశల కాలంలో అంటు వ్యాధుల సంఖ్యను, వ్యాధి వ్యాపిస్తున్న ప్రాంతాలు, వాటిని అదుపు చేసే చర్యలను మనం గమనించలేము. ప్రస్తుత విధానాలు ఏమి సాధించేందుకు రూపొందించబడినాయో, ఏవి ఉపకరిస్తాయో, ఏవి ఉపకరించవో తెలిపే ఆధారాలు లేవు. ఇతర రాష్ట్రాల అనుభవాలను స్వీకరించే ప్రయత్నం చేయడం లేదు. దీనికి బదులుగా జవాబుదారీతనం లేని ఉద్యోగ స్వామ్యాన్ని చూస్తున్నాం. క్షేత్రస్థాయి వాస్తవాలకు సంబంధం లేని అధికారిక ప్రకటనలు చూస్తున్నాం.
వ్యాక్సిన్ కోసం భారతదేశం రూపొందిస్తున్న ప్రణాళికలపైన కూడా ఇలాంటి మౌనాన్ని గమనిస్తున్నాం. శాస్త్రీయమైన సమర్థత, పారిశ్రామిక సామర్థ్యం మనకు ఉంది. ఎలాంటి విజయవంతమైన వ్యాక్సిన్ అయినా పెద్ద మొత్తంలో తయారు చేయగల సామర్థ్యం మనకుంది. మన దేశంలో కనీసం మూడు ప్రధాన వ్యాక్సిన్ల తయారీ కేంద్రాలున్నాయి. ప్రాముఖ్యత కలిగిన మందులలో ఒక భాగాన్నైనా భారత ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు భారత ప్రభుత్వం ఏమైనా ప్రయత్నం చేస్తున్నదా? ప్రపంచ పేద ప్రజలు భారతదేశాన్ని మందుల అంగడిగా భావిస్తున్నారు కదా! మన ప్రభుత్వం వ్యాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన సదుపాయాలను బలోపేతం చేయడానికి గాను నిధులను సమకూర్చడానికి కట్టుబడి ఉందా? ఇప్పటికైనా దీని సాధనకు దూరదృష్టితో కూడిన ప్రణాళికను రూపొందించామా? ప్రణాళిక అమలుకు కావాల్సిన రాజకీయ సంకల్పం ఉందా? లేక ట్రంప్ తాను ఉత్పత్తిదారుల నుండి స్వాధీనం చేసుకున్న వ్యాక్సిన్ను భారతదేశానికి సరఫరా చేస్తాడని నమ్ముదామా?
మహమ్మారి ముందు లొంగిపోయిన మోడీ ప్రభుత్వ పాలన, ఆర్థిక వ్యవస్థ ఉద్దీపనలతో సరి అవుతుందనే నమ్మకంతో ఉన్నట్టుంది. దురదృష్టవశాత్తు మనం రెండు విధాలైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుంది. తీవ్రమవుతున్న అంటువ్యాధిని, దిగజారి పోతున్న ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుంది. మహమ్మారి సమస్య ప్రభుత్వ జోక్యాన్ని, ప్రభుత్వ ఆరోగ్య విధానాన్ని డిమాండ్ చేస్తున్నది. కానీ మోడీ పాలనలో ఈ రెండింటినీ కోల్పోతున్నాం.
'పీపుల్స్ డెమోక్రసీ' సౌజన్యంతో
- ప్రబీర్ పుర్కాయస్థ
అనువాదం:మల్లెంపాటి వీరభద్రరావు,
సెల్:9490300111