Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుదీర్ఘ కాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయు లకు పదోన్నతులు కల్పించా లని నిర్ణయం తీసుకున్నది. దీంతో కొత్తజిల్లాల ప్రాతిప దికన పదోన్నతులు కల్పిస్తారా..? లేక ఉమ్మడి జిల్లా ప్రాతి పదికన పదోన్నతులు కల్పిస్తారా..? అనే విషయమై ఉపాధ్యాయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించడంతో ఆ మేరకు విద్యా శాఖాధికారులు జాబితాలను సిద్ధం చేసి పంపించారని సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతినెలా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడంతో పాటు, ప్రతి ఏడాది బదిలీలను చేపట్టారు. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో తొలిసారిగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడంతో పాటు బదిలీలు చేపట్టారు. ఆ తర్వాత పదోన్నతులు, బదిలీల జోలికి ప్రభుత్వం వెళ్లలేదు. ఈ రెండు అంశాలపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి పలుసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా స్పందించ లేదు. 2018లో మాత్రం కేవలం ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టారు. ఇతరశాఖల్లో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పదోన్నతులు కల్పించినప్పటికీ, ఉపాధ్యాయులకు మాత్రం పదోన్నతులు కల్పించింది లేదు. దీంతో వేలాది మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందకుండానే ఉద్యోగ విరమణ చేశారు. పదోన్నతులు నిర్వహించని కారణంగా ఇంక్రిమెంట్ల విషయంలో చాలా మంది ఉపాధ్యాయులు నష్టపోయారు. దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దెబ్బతినడంతో పెండింగులో ఉన్న పీఆర్సీని ప్రకటించి, పదోన్నతులు కల్పించి ఖాళీలను భర్తీ చేయాలన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆందోళనకు ప్రభుత్వం దిగివచ్చింది. ఈ నెలాఖరుకల్లా కొత్త పీఆర్సీ ఇవ్వడంతో పాటు అన్ని కేటగిరీల్లో పదోన్నతుల ద్వారా ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. జీహెచ్ఎం గ్రేడ్ 2, ఎల్ఎఫ్ఎల్ పోస్టులను వందకు వంద శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయనుండగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మాత్రం ఖాళీల్లో 70శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు. 30శాతం పోస్టులను, ఎస్జీటీ పోస్టులను నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. పదోన్నతుల ప్రక్రియను చాలా మంది ఉపాధ్యాయులు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన కల్పిస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని అంటున్నారు. 2018లో ఉమ్మడి జిల్లాల వారీగానే బదిలీలు చేపట్టడం వల్ల మారుమూల ప్రాంతాల్లో చాలా వరకు పోస్టులు ఖాళీ అయ్యాయి. కొత్త జిల్లాల వారీగా పదోన్నతులు కల్పిస్తే మాత్రం సీనియర్లకు అన్యాయం జరుగనున్నదని పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు. ఐదున్నరేండ్ల తర్వాత పదోన్నతులు కల్పిస్తున్న దృష్ట్యా ఉమ్మడి జిల్లాల వారీగానే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకనైన ముఖ్యమంత్రి, విద్యామంత్రి, అధికారులు ఉపాధ్యాయ సంఘ నాయకులతో చర్చించి తక్షణమే పదోన్నతుల ప్రణాళికను విడుదల చేయాలి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ముందుకు రావాలి.
- రంగు రాజేశం
సెల్:848811424