Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారు చాలా ఏండ్ల నుంచి తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. తమ హక్కుల కోసమే కాకుండా ప్రజారోగ్యవ్యవస్థను బాగు చేయాలని తపన పడుతున్నారు. ఇందు కోసం కేంద్రం, రాష్ట్రంలో అధికారానికి రాకముందు ఆయా పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నారు. శాంతియుతంగా వినతిపత్రాలు సమర్పిస్తూ, సభలు, సమావేశాల ద్వారా తమ డిమాండ్లను వినిపిస్తూ వచ్చారు. రాజకీయ నాయకులను కలవడమే తప్ప ఆ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. అయితే ఏండ్లకు ఏండ్లు గడుస్తున్నా తమ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉండటంతో తామే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. నర్సుల సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వాలు పట్టంచుకోవడం లేదని తమ ప్రతినిధులను ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి పంపుతున్నారు. స్వతంత్రుల సంఖ్య పెరిగిపోతుండటంతో చివరికి ఎవరికి లాభిస్తుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
-కె.ప్రియకుమార్