Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభు భక్తి ఉండాలి కానీ, మరీ పాదాలపై పడి నాకేంత భక్తి మంచిది కాదేమో! ఇప్పుడు అధికారపార్టీ సోషల్ మీడియా పరిస్థితి అచ్చు అలాగే తయారయ్యింది. మాజీ ప్రధాని, నూతన సరళీకృత ఆర్థిక విధానాల అమలు కర్త, ఆయోధ్య రామమందిర సమయ విధ్వంస మౌనముని పీవీ నర్సింహారావు కుమార్తెను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించకపోతే ఓ మహామేధావికి, తెలుగు జాతికి అవమానం అంటూ ప్రభు భక్తి పరాయణలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి హల్చల్ చేస్తున్నారు. వారసురాలికి ఓటేయమన్నారు. అంతవరకూ ఓకే...దానికంటే ముందు టీవీ డిబేట్లలో వెలగబెట్టడం తప్ప, ఒరగబెట్టిన ప్రయోజనం ఏమీ లేదంటూ ప్రత్యర్థులను కించపర్చేలా కామెంట్లూ చేశారు. ఆ పోస్టును చదివిన రెండో తరగతి సంటోడిక్కూడా వస్తున్న ఒకే ఒక్క డౌటనుమానం ఏంటంటే... ప్రత్యర్థులు కనీసం టీవీ డిబేట్లలోనన్నా ప్రజాసమస్యల్ని నెత్తికెత్తుకుంటున్నారు. (వారి ప్రజా పోరాటాలను గుర్తించడం వీరికి ఎలాగూ చేతకాదనుకోండీ..) మరి పీవీ వారసురాలు ఏనాడూ, ఎక్కడా, ఎప్పుడూ జనంలో కనిపించిన బాపతే కాకపాయే. మా తాతలు నేతులు తాగారు..మా మూతులు వాసన చూడండి అంటూ వారసత్వ వాటాయే తప్ప, జనానికి ఒరగబెట్టిందీ ఏమీ లేకపాయే... పైత్యం పీక్ స్టేజ్కి చేరితే పోస్టులు పెట్టడానికి కూడా కంటెంట్ ఉండదంటే ఇదే మరి!
-కెఎన్ హరి