Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువత మద్యానికి బానిసలవు తుండటంతో మత్తులో చోటుచేసుకుంటున్న ఘర్షణలు హత్యలకు దారితీస్తున్నాయి. మద్యం సేవించిన అనంతరం ఘర్షణలకు పాల్పడి అవి మరుగైపోయినా, మళ్ళీ కొందరు అదే పనిగా కక్షపెంచుకొని పార్టీలకు తీసుకువెళ్ళి అదునుచూసుకొని హత్య చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మద్యం అలవాటు ప్రాణస్నేహితులను సైతం బద్ద శత్రువులుగా మార్చి హత్యలకు ప్రేరేపిస్తున్నది. ఉదాహరణగా ఇటీవల జరిగిన అనేక సంఘటనలు చెప్పవచ్చు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యలను హతమార్చిన భర్తల సంఘటనలు, కొడుకులు తల్లిదండ్రులను హతమార్చిన సంఘటనలు ఇటీవల సమాజంలో ఎక్కువవుతున్నాయి. యువత మద్యం మత్తులో తూలుతూ వాహనాలపై విచ్చలవిడిగా సంచరిస్తూ అనేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. మద్యాంనికి బానిసలైన యువతను కాపాడవలసిన అవసరం ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలపై ఉంది. దీనికి తోడు మద్యం షాపులకు ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వకూడదు. కానీ గుడి, బడిల సమీపంలో మద్యం అమ్మకాలు ఉండటం శోచనీయం. మత్తులో మహిళలను వేధించటం, టీజింగ్లకు పాల్పడటం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ను విస్తృత పరచి మద్యం బాబులను కఠినంగా శిక్షించాలి. ఎటువంటి ప్రలోభాలకు పాల్పడకుండా ఒత్తిడిలకు గురికాకుండా మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు పాల్పడిన ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా జరిమానా విధించాలి. పదేపదే తప్పులకు పాల్పడేవారిపై చర్యలు కఠినంగా శిక్షించాలి.
- ఎ.ఎస్.రావు, ఖమ్మం.