Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అరె అప్పుడే ఓట్ల పండగ అయిపోయిందిరా బై? ఇంకొక నెల రోజులుంటే మస్తుగుండెర బై. రేపట్నుంచి ఎట్ల పొద్దుబోతదో ఏమో? నెలసంది మస్తు పొద్దుబాయే. వేళకు ఇంత సుక్కబోసే...బిర్యానీ బెట్టించే...డబ్బులిచ్చే. ఇగ రేపట్నుంచి ఎవ్వడు మందలియ్యడు. ఎప్పుటోలే పొట్టతిప్పల కోసం జెర్రిపోతుల ఆట ఆడాల్సిందే' అంటూ ఊర్లర్ల గుసగుసలు వినబడుతున్నాయి. ఇంకో దిక్కు పోలింగ్ అయిపోంగనే తీరిక దొరికిన అభ్యర్థులు ఓ చోట కూర్చొని తలలు పట్టుకుంటున్నరు. 'ఎన్నడ్లేంది గిన్ని పైసలు ఖర్చయినాయిర బై? మనం ఓటుకు రెండు మూడు పంచినమా? గిన్ని డబ్బులు పెట్టినా గెలుస్తమో? లేదో? మన ఎంట తిరిగినోళ్లు.. జైకొట్టినోళ్లు...తాగినోళ్లు..పైసలు దీసుకున్నోళ్లు... అసలు ఓట్లు ఏసిండ్రంటనా? ఏం వశమతలేదాయే?' అని నెత్తీనోరూ బాదుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇగ ఇచ్చిన అందరు అభ్యర్థుల కాడా పైసలు దీసుకున్న ఓటరు మాత్రం తనకు నచ్చినోళ్లకు ఈవీఎం మీట నొక్కి, సైలెంట్గా ఎవరి గొంతు నొక్కిండో తెలుసుకోవాలంటే ఈ నెల 11 దాకా ఆగాల్సిందే సుమా!
- అచ్చిన ప్రశాంత్