Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో భద్రమై ఉన్నది. ఈ లోపు ఎగ్జిట్ పోల్స్ వచ్చి నానాయాగీ చేస్తున్నాయి. ఇప్పటిదాక జెండాలు, ఎజెండాలపై చర్చ జరిగితే... ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వీటిని ఎవరికి వారు తమ పార్టీలకు అనుకూలంగా అన్వయించు కుంటుంటే... అవి నిజం కాదని మరికొందరు వాదిస్తున్నారు. తమిళనాడు, కర్నాటక ఎన్నికలకు ముందు జాతీయ మీడియా ఎగ్జిట్ పోల్స్ తలకిందులైనట్టు మరికొందరి విశ్లేషణలు. పోల్స్ తమ పార్టీకి అనుకూలంగా వస్తే సంబరపడిపోతుంటే... ప్రతికూలంగా వచ్చిన నేతలు కండ్లు తేలేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ చాలా ఏండ్ల క్రితమే విశ్వాసనీయత కోల్పోయాయన్న వాదన వినిపిస్తున్నది. మీడియా కార్పొరేట్ కంబంధహస్తాల్లో ఉన్నట్టే... ఎగ్జిట్ పోల్స్ కూడా వారి అమ్ముల పొదిలిలో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా... ఓటరు మాత్రం ఎక్కడా బయటపడలేదు. 'విడవమంటే పాముకు కోపం... కరవమంటే కప్పకు కోపం' అన్న దోరణిలోనే గుంభనంగా వ్యవహరించాడు సీజన్ బట్టి ఫలాలు... ట్రెండ్ను బట్టి ఫలితాలను అంచనా వేయవచ్చు. దాన్ని బట్టే బరి నుంచి ఎవరు ఎగ్జిటో తేలిపోతున్నది.
- గుడిగ రఘు