Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు బీసీల గణాంకాలు లెక్కబెడతారు. ఇప్పటికి రెండు మూడుసార్లు లెక్కబెట్టిఉంటారు. ఇప్పుడు మహిళా బీసీల గణాంకాలు అని ఎన్నిసార్లు చేబడతాయి. గతంలో కార్పొరేషన్లలో బీసీల గణాంకాలు చేపట్టారు. పంచాయతీలు గ్రామ పంచాయతీలలో చేపట్టారు. ఎన్నికల ముందు మాత్రమే గణాంకాలు గుర్తుకు వస్తాయి. గణాంకాలు చేపట్టేటప్పుడే మహిళలు ఎందరున్నారు, పురుషులెందరున్నారని చేబడతారు. అప్పుడే మహిళలను విడివిడిగా లెక్కలు చేబడితే ఇలాంటివి రావు. గణాంకాలు సైతం పారదర్శకంగా ఉండాలి. ఎస్సీ, బీసీ, ఎస్టీ లకు సంబంధించిన మహిళలు పురుషుల ఓటర్ల గణాంకాలను సక్రమంగా చేపట్టాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఆదరా బాదరగా లెక్కలు చేపట్టడం వల్ల ఓటర్లు నమోదు చేయటం వల్ల కొత్త ఓటర్లకు కొన్ని చోట్ల గుర్తింపులేదు. ఉన్న చోట్ల పేర్లను తొలగించారు. ఓటర్లు గణాంకాలు సక్రమంగా నిర్వహించి అందరికీ రిజర్వేషన్స్ అందేలా ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది.
- ఎ.రఘురామారావు,
ఖమ్మం.