Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుల్వామాల్ ఉగ్రవాదుల దాడి సుమారు 44మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకోవడం అమానుషం, అనాగరికం. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే తామే ఈ దుర్ఘటనకు పాల్పడినట్టు వెల్లడించింది. పాకిస్థాన్ కావాలనే కవ్వింపులకు దిగుతూ ఏదో ఒక రూపాన దాడులు చేస్తోంది. మన భారత జవాన్లతో ముఖాముఖి పోరాడే ధైర్యం లేక దొంగచాటుగా దెబ్బతీసారు. కాశ్మీర్ ఉగ్రవాదుల ఆత్మహుతిదాడి భారత జవాన్లను మట్టుపెట్టడం భారత్లోని ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిందే. కానీ తమ సర్జికల్ స్ట్రయిక్లతో ఉగ్రవాదాన్ని తుదముట్టించాం అని గొప్పలు చెప్పుకునే మోడీ సర్కార్ దీనికేం సమాధానం చెపుతుంది? గతంలో జరిగిన ఉగ్రదాడులతోపోలిస్తే ఈ సంఘటన పెద్దదాడిగా చెప్పవచ్చు. అమరులైన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిద్ధాం. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల త్యాగాలు వృధాకావు. ఉగ్రవాదులది పిరికిపందల చర్య. మరణించిన జవాన్లకు నివాళులర్పిద్దాం. ఈ దాడిని ముక్తకంఠంతో ఖండిద్దాం. ఉగ్రవాదుల భరతం పట్టాల్సిందే. కూకటివేళ్లతో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి. దాడిలో గాయపడ్డ జవాన్లకు మెరుగైన చికిత్స అందించాలి.
- కె. సతీష్రెడ్డి, జయశంకర్భూపాలపల్లి.