Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు కూరగాయల విక్రయదార్లు బోర్టు పట్టికలో నిర్ణయించిన రేట్ల ప్రకారం కాకుండా వారికి తోచిన విధంగా అమ్ముతున్నారు. పక్క పక్కనే పది నుంచి 20 రూపాయలు వరకూ తేడా ఉంటుంది. ముఖ్యంగా రేట్లు అధికంగా పలికే కూరగాయలకు తక్కువ పంట పండి వినియోగదారులు వాడే వాటిపై ఎక్కువ వసూలు చేస్తున్నారు. కొన్ని రైతు బజార్లలో మాత్రమే ఇలాజరుగుతుంది. పర్యవేక్షకులు దీన్నిపట్టించుకునే స్థితిలో లేరు. కొందరు నిజాయితీగా ఉన్న రేట్లను అమలు పరుస్తున్నారు. కొందరు మాత్రమే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇలాంటివి నిరోధించాల్సిన అవసరం ఉంది. ప్రక్క ప్రక్కనే డబుల్రేట్లకు విక్రయిస్తుంటే సూపర్వైజర్లు మిన్నకుంటున్నారు. ఖమ్మం పట్టణంలోని ఒక ప్రధాన రహదారిలో ఉన్న మార్కెట్లో ఈ పరిస్థితి ఉంది. నిరంతరం వాకింగ్కు వచ్చిపోయే వారితో పాటు రైతుబజార్ కిటకిటలాడుతుంది. దీన్ని నిరోధించాలి. తక్కువ రేటు ఉన్నవి ఎక్కువ రేటుకు అమ్మటం ఎంతవరకు సమంజసం అని కొనుగోలుదారులు వాపోతున్నారు. మధ్యతరగతి వారు ఇబ్బందుల పాలవుతున్నారు.
-ఎఆర్ఆర్, ఖమ్మం.