Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సృష్టిలో తీయనైన పదం అమ్మ. అమ్మను మించిన దేవుడు లేనే లేడు. అమ్మ రుణం తీర్చలేనిది. ప్రతీ యేటా మేనెలలో రెండవ ఆదివారం అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని నిర్వహిస్తారు. మదర్ ఆఫ్ గాడెస్గా భావించే రియోకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటి సారి గ్రీసులో నిర్వహించారు. రోమన్లు 'మదర్ ఆఫ్ గాడెన్'గా పరిగణించే సైబిల్కు గౌరవసూచకంగా మాతృదినోత్సవాన్ని నిర్వహించే వారంట. 17వ శతాబ్దంలో ఇంగ్లండ్లో తల్లులకు గౌరవ పూర్వకంగా మదరింగ్ సండే పేరిట ఉత్సవాలు నిర్వహించినట్టు సమాచారం. ఈస్టర్కు ముందు నలభై రోజులను లెంటో రోజులుగా పరిగణిస్తారు. ఈ నలభై రోజులలోని నాలుగవ ఆదివారంనాడు మదరింగ్ సండే నిర్వహించేవారు.
కొన్ని యూరప్ దేశాలలో బ్రిడెడ్ అనే దేవతపైన భక్తి ప్రకటిస్తూ మాతృదినోత్సవాన్ని నిర్వహించారు. జూలియావర్డ్ హౌవ్ అనే మహిళ 1872లో (అమెరికా) తొలిసారిగా ప్రపంచశాంతి కోసం మదర్స్డే నిర్వహించాలని ప్రతిపాదించింది. బోస్టన్లో సమావేశా లను కూడా ఏర్పాటు చేసింది. అన్నా మేరీ జెర్విన్ అనే మహిళ సివిల్వార్ గయాల స్మృతులను చెరిగిపోయేలా చేసేందుకు మదర్స్ ఫ్రెండ్షిప్ నిర్వహించింది. ఆమె 9.5.1905న చనిపోయింది. కూతురైన మిస్జర్విస్ మదర్స్డే నిర్వహించాలని ప్రచారం చేసింది. తన తల్లి రెండవ వర్ధంతి సందర్భంగా మే నెలలోని రెండవ ఆదివారం మదర్స్డే నిర్వహించింది. వర్జీనియా రాష్ట్రం అమెరికాలోనే తొలిసారిగా 1910లో ఈ దినోత్సవాన్ని నిర్వహించింది. జెర్విన్ చేసిన ప్రచారం ఫలితంగా 1911లో నాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రోనిల్సన్ మదర్స్డేను అధికారికంగా జరపాలని నిర్ణయించారు. ఆ రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు.
కాదికీ నివాసి అయిన మేరీటోన్స్ నసీన్ (1800-1906)అనే యువతి 1888లోనే తన తల్లి పుట్టిన రోజు అయిన ఏప్రిల్ 20వ తేదీన మదర్స్డే నిర్వహించినట్టు తెలిపారు. మదర్స్డేకి సంబంధించి ఆఫ్రికన్ దేశాలు బ్రిటిష్ సంప్రదాయాన్ని అనుకరిస్తుండగా, తూర్పు ఆసియా దేశాలు అమెరికన్ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, ఇటలీ, ఆస్ట్రేలియా, టర్కీ, బెల్జియం దేశాలతో పాటు ప్రపంచంలోని అత్యధిక దేశాలు మేనెలలో రెండవ ఆదివారంనాడు మాతృ దినోత్సవాన్ని జరుపుకుం టున్నాయి. మనిషిని నవమాసాలు మోసి కనిపెంచిన అమ్మ ఆపాయ్యత, అనురాగం, మమకారం వెలకట్టలేనిది. అనురాగమూర్తి అమ్మ. అమ్మ మంచితనం, స్ఫూర్తి ఎంత చెప్పినా తక్కువే. కనిపించని దైవం కన్నా కనిపెంచే దైవం అమ్మ. అమ్మ అనే పిలుపులోనే ఆత్మీయత ఉంది. తాను తినకున్నా తన పిల్లలకు తినిపించి తృప్తిపడుతుంది. ఇటీవలి కాలంలో తల్లులను పోషించకుండా తమ కుమారులు వృద్ధాశ్రమాలలో చేర్పిస్తున్నారు. ముదుసలి వయస్సులోని తల్లులను ఆదరించడం లేదు. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నవారు, ధనవంతులు తమ తల్లులకు సరైన గౌరవం ఇవ్వడం లేదు. ఇంటిలో నుంచి తల్లులను గెంటివేస్తున్న కుమారులు ఉన్నారు. దేవాలయాల ముందు, నడివీధులలో, రైల్వేస్టేషన్, బస్స్టేషన్, హౌటల్స్ ముందు నిలబడి భిక్షాటన చేస్తున్న తల్లులున్నారు. తల్లులతో మనసు విప్పి మాట్లాడేవారే కరువైనారు. తల్లి మరణించినా అంత్యక్రియలు చేయని కుమారులు ఉన్నారు. ప్రతిరోజూ అమ్మను కలిసి మాట్లాడటం కుదరనివారు వీలైన సందర్భాల్లో సంతోషంగా.. ఆప్యాయంగా మాట్లాడుదాం. అమ్మకు సముచిత గౌరవం ఇద్దాం. మాతృ దినోత్సవానికి సార్థకత తెద్దాం. అమ్మా..! శతకోటి వందనాలు..!!}|
- కె. సతీష్రెడ్డి
సెల్:9848445134