Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాఠశాలలు ప్రారంభమయ్యాయి. చాలా అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. అరకొర పుస్తకాలు కాకుండా అన్ని పాఠశాలలకు అన్ని సబ్జెక్టుల పుస్తకాలు సరఫరా చేయవల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యా సంవత్సరం సగమైన తరువాత పాఠ్యపుస్తకాలు సరఫరాచేస్తే విద్యార్థినీ, విద్యార్థులకు ఏమీ ఉపయోగం ఉండదు. విద్యార్థినీ విద్యార్థుల సంఖ్యను ఆధారంగా అన్ని పాఠశాలలకు పంపాలి. దానికి తగ్గట్టు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేయాలి. ప్రతీ పాఠశాలకు యూనిఫామ్స్ కూడా సకాలంలో పంపిణీ చేయాలి. ఈ విద్యా సంవత్సరం అయినా ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలి.
- షేక్ అస్లాం షరీఫ్,
శాంతినగర్.