Authorization
Mon Jan 19, 2015 06:51 pm
' పుట్టుక నీది చావు నీది బతుకాంతా ప్రపంచానిది' అన్న మాటలకు సరిగా సరిపోయే వ్యక్తి 'చే గువేరా' భావితరాలకు ఉజ్వల భవితను నిర్మించడం కోసం నిండు జీవితాన్ని సమిధను చేసి అర్పించేవారు చరిత్ర నిర్మాతలై చిరస్థాయిగా నిలుస్తారు. నేటి యువత సరికొత్త ఫ్యాషన్ సింబల్ గా టీ షర్టులపై దర్శనమినస్తున్న చేగువేరా అలాంటి ఆదర్శ వ్యక్తి. గుండెలపై గువేరాను మోస్తున్న యువతలో ఎక్కువ మందికి ఆ విషయం ఎరుక లేకపోవడం చోచనీయం. విదేశీయుడు అని విపరితపు మాటలు మాట్లాడే వారు సైతం ఆయన జీవితంలోకి తొంగి చూసే ప్రయత్నం చేసినా ఆయనను గుండెలపై కాదు గుండెల్లో దాచుకోకుండా ఉండలేరు. జీవితం విలువను ఎరిగిన వాడు కాబట్టే చే తన గుండె నెత్తురుతో పీడిత జనవిముక్తి మార్గాన్ని వెలిగించాడు. 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రొసీరియా పట్టణంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఎర్నెస్టో చే గువేరా విప్లవకారుడు మాత్రమే కాదు. వైద్య విద్యకోసం 1948లో బ్యూనస్ ఎయిరిన్ విశ్వవిద్యాలయంలో చేరిన చే 'ప్రపంచాన్ని శోధించాలనే ఆకలి' ని భరించలేక వైద్య విద్యను పక్కన పెట్టి మరి మోటర్ సైకిల్ ఎక్కాడు. 1950లో ఉత్తర అర్జెంటీనాలో ని గ్రామసీమలను చుట్టేస్తూ 450 కిలో మీటర్లు ప్రయాణించినా ఆ ఆకలి తీరలేదు. మరల 1995లో మరోసారి మోటర్ సైకిలెక్కి 9 నెలల పాటు అర్జెంటీనా, చిలీ, పెరూ, ఈక్వడార్, కొలంబియా, వెనుజులా, పనామా లతో పాటు అమెరికాలోని మియామీ , ఫ్లోరిడాలను సందర్శించారు. మూడోసారి సుదీర్ఘ ప్రయాణం 1967లో బొలివియాలో ముగిసింది. మెక్సికోలో క్యూజా విప్లవ నేత ఫెడెల్ క్యాస్ర్టోకు సన్నిహిత మిత్రునిగా ఉంటూ కమ్యూనిస్టుగా మారిడు. క్యాస్ర్టోతో కలిసి 1956లో క్యూబా చేరాడు. అప్పటి నుండి గెరిల్లా యోధునిగా మొక్కవోని దీక్షతో సాహనంతో పోరాటం చేశాడు. క్యూబా విప్లవంలో క్యాస్ర్టో తరువాత రెండో నేతగా ఎదిగాడు. 1959లో క్యూబా విప్లవం విజయానంతరం చే క్యాస్ర్టో ప్రభుత్వంలో కీలక బాధ్యతలను నిర్వహించాడు. 1959లో భారత్ పర్యటించినప్పుడు సైతం చే నిజాన్ని సూటాగా చెప్పడానికి వెనుకాడలేదు. 200 సంవత్సరాల సామ్రాజ్యవాద పాలనకు తెరపడింది. కానీ భారత్ లో ఇంకా పేదరికం తాండవం మాడుతేనే ఉంది. ఎక్కువ భూమి కొద్దిమంది చేతిలోనే ఉండటమే దీనికి కారణం అని చాలా సూటిగా ఖచ్చితంగా చేప్పాడు. కానీ సాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా కూడా చే వెలెత్తి చూపిన పరిస్థితిలో కొంచెం కూడా మార్సు రాలేదు అంటే అతిశయోక్తి కాదు. సామాజిక న్యాయం సాధించాల్సిన లక్ష్యం ఇంకా మిగిలే ఉంది. 1965లో అల్జీరియాలో చివరి సారిగా బహిరంగంగా కనిపించిన చే తిరిగి మరల క్యూబాకి వెళ్లలేదు. అప్పటికే క్యూబాకి వీడ్కోలు లేఖ రాశారు. ప్రపంచ విప్లవాన్ని విజయవంతం చేయడం కోసం తన జీవితాన్ని అర్సిస్తున్నాను అని ప్రకటించిన చే బోలివియాలో విప్లవ కార్యకలాపాలు ప్రారంభించాడు. విప్లవం ఉద్రుత్తంగా సాగుతున్న తరుణంలో సిఐఏ సమాచారంతో 1967 అక్టోబర్ 8న బోలివియా సేనలు భారీ ఎత్తున చే స్థావరాన్ని చుట్టుముట్టి దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన చే ను బంధిగా చేసుకొని ఇంట్రాగేట్ చేయడానికి వచ్చిన అధికారులపై ఉమ్మి తన ప్రతిఘటనను తెలియజేశాడు. దానితో బోలివియా సేనలు అక్టోబర్ 9న చే ను విచక్షణ రహితంగా కాల్చి చంపేశారు. అక్టోబర్ 18న చే చేతులు మాత్రమే క్యూబా రాజధాని హవాయి చేరుకున్నాయి. దాదాపు 10 లక్షలమందితో నివాళ్లు అర్పించారు. మున్నెన్నటికన్నా కూడా నేటితరానికి చే జీవితాన్ని, ఆచరణను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. చే చూపించిన మార్గాన్ని స్వీకరించి అసమానతలు లూని భవితను నిర్మించాల్సి ఉంది. 91వ జయంతి సందర్భంగా అదే 'చే' కు మనం ఇచ్చే నిజమైన నివాళి!