Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్టాండ్లలో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. బస్టాండ్ల్లో తాగునీటి సౌకర్యం ఉండటం లేదు. మరుగుదొడ్ల కొరత కూడా తీవ్రంగా ఉంది. ఇక చాలా బస్టాండ్లలో పరిశుభ్రత లోపం బాగా కనిపిస్తోంది. బస్టాండ్లలో ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది. ఎక్కువ మంది ప్రజలు ఈ బస్టాండ్లకు వచ్చి ప్రయాణం చేస్తుంటారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం వల్ల ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. ఎక్కడ కూర్చోవాలో తెలియదు. ఎక్కడ నిలబడాలో తెలియదు. చెత్తాచెదారంలో నుండే నడిచిపోవాలి. ప్రభుత్వం ప్రతి బస్టాండ్ స్థితిగతులపై ఆరాతీయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రతి బస్టాండ్లో మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి బస్టాండ్ను పరిశుభ్రంగా ఉంచి, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి.
- షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్.