Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గూఢచర్యం అభియోగంపై పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసులో పాక్ విధించిన మరణశిక్షను నిలుపుదల చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. 2016లో గూఢచర్యం ఆరోపణలపై బలూచిస్థాన్లో కులభూషణ్ జాదవ్ను అరెస్టు చేయడం, సుమారు ఇరవై రోజుల తర్వాత జాదవ్ అరెస్టు గురించి భారత్కు పాకిస్థాన్ తెలపడం, తదనంతరం గూఢచర్యం కుట్రకు పాల్పడ్డాడంటూ పాక్ సైనిక కోర్టు మరణశిక్ష ఖరారు చేయడం, వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందంటూ భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, తదనంతర పరిణామాల తర్వాత సత్యమేవ జయతే అన్న విధంగా మన ప్రధాని మోడీ తీసుకున్న దౌత్యపరమైన చొరవకు లభించిన విజయంగా అభివర్ణించవచ్చు. కులభూషణ్ కేసు విచారణ పాక్లో సరిగ్గా జరగలేదు. పాక్ జైలులో ఉన్న కులభూషణ్ను కలిసేందుకు భారత ప్రభుత్వానికి కూడా అనుమతులు ఇవ్వకపోవడంతో భారత్లో పాక్పై నిరసనలు వ్యక్తం అయినాయి. భారత్ ఎన్నిసార్లు అప్పీల్ చేసినా పాక్ బేఖాతరు చేసింది. వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఐసీజే అధ్యక్షులు అహ్మద్ యూసఫ్ స్వయంగా తీర్పు వెలువరించి తనేమిటో నిరూపించుకున్నారు. ఈ తీర్పును ప్రతీ ఒక్కరూ స్వాగతించాల్సిందే. ఈ తీర్పు పాక్కు చెంపపెట్టు. కులభూషణ్ను విడిపించి భారత్కు తీసుకురావడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
- కామిడి సతీష్రెడ్డి, జయశంకర్భూపాలపల్లిజిల్లా.