Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య సంఘటనలో నిందితుడు, కామోన్మాది ప్రవీణ్కు ఉరిశిక్ష ఖరారు చేస్తూ వరంగల్ జిల్లా కోర్టు న్యాయమూర్తి చరిత్రాత్మక తీర్పును ఇవ్వడం అభినందనీయం. గత జూన్ 18న రాత్రి వరంగల్ అర్బన్జిల్లా హన్మకొండలో తల్లి పొత్తిళ్లలో నిద్రిస్తున్న పసిపాపను కామాంధుడు ప్రవీణ్ అత్యాచారం, హత్య చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉన్మాది ప్రవీణ్ను బహిరంగంగా ఉరితీయాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంఘాలు ఆందోళనలు సైతం నిర్వహించాయి. చిన్నారి తల్లిదండ్రులు కూడా న్యాయ పోరాటం చేసారు. నేరస్తుడి పక్షాన వాదించేది లేదని వరంగల్ బార్ అసోసియేషన్ నిర్ణయించింది. సుమారు 20రోజులలోనే పోలీసులు చార్జీషీట్ దాఖలు చేసి పోలీసుశాఖ గౌరవాన్ని పెంచారు. 51రోజులలోనే తీర్పు వెల్లడికావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పును ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే. కామోన్మాదులకు ఈ తీర్పు ఒక హెచ్చరిక. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత తక్కువ సమయంలో విచారణ పూర్తిచేసుకున్న కేసుగా రికార్డు నమోదుచేసుకుంది. వరంగల్ పోలీసులు విచారణను వేగవంతం చేసి 'శభాష్' అనిపించుకున్నారు. న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచింది. ఆడపిల్లలపై జరుగుతున్న అమానవీయ అకృత్యాలపై ఇలాంటి తీర్పులు మరెన్నో వెలువడాల్సిన అవసరం ఉంది. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ యిచ్చిన తీర్పు కామాంధులకు గుణపాఠం కావాలి. సంచలన తీర్పు నిచ్చిన వరంగల్ మొదటి అదనపు సెషన్స్ జడ్జి కె. జయకుమార్, దర్యాప్తు అధికారి హన్మకొండ ఏసీపీ శ్రీధర్, మిగతా సిబ్బందికి కృతజ్ఞతలు.
- కామిడి సతీష్రెడ్డి, జయశంకర్భూపాలపల్లిజిల్లా.