Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రవ్యాప్తంగా సీజనల్ వ్యాధులతో బాధప డుతూ ప్రజలు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో ప్రజలు జ్వరాలతో వణికిపో తున్నారు. జలుబు, దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, చలిజ్వరాలతో, కండ్లకలకతో ఇంటికి ఒకరుచొప్పున ఉన్నట్టుగా పరిస్థితి ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వైరల్ జ్వర పీడితులతో కిటకిటలాడు తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులలో పూర్తిస్థాయిలో వైద్యం అందని పరిస్థితి. వ్యాధిగ్రస్తులు ప్రయివేటు ఆస్పత్రులలోనూ చికిత్స పొందుతున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రయివేటు ఆస్పత్రుల నిర్వాహకులు వివిధ రకాల పరీక్షలు, మందులు, రక్తకణాల సంఖ్య తగ్గిందంటూ అందినకాడికి దోచుకుంటున్నారు. రోగుల నుంచి అధిక మొత్తంలో వివిధ రకాల ఫీజుల పేరిట ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. 'డెంగ్యూ' వంటి ప్రాణాంతక వ్యాధులను నిర్ధారించే పరికరాలు ప్రభుత్వ ఆస్పత్రులలో లేకపోవడం, పూర్తిస్థాయిలో వ్యాధులను తగ్గించే మందులు లేకపోవటం, రోగులు పడుకోవడానికి బెడ్స్ లేకపోవడం, వైద్యులు సరిగా పట్టించుకోవడం లేదనే ప్రజలు 'ప్రయివేటు' బాట పడుతున్నారు. పాఠశాలకు వెళ్లే పిల్లలకు మాత్రమే గాక ఐదేండ్ల లోపు గల చిన్నారులు అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. అనేక మంది మలేరియా జ్వరాలతో ఆధపడుతుండటం ఆందోళన కలుగుతోంది. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి. ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీపై ఉక్కుపాదం మోపాలి.
- కామిడి సతీష్రెడ్డి,
జయశంకర్భూపాలపల్లి జిల్లా.