Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ తీర్పు ప్రకారం లిమిటేషన్ చట్ట ప్రకారం ప్రయివేటు వ్యక్తుల లేదా సొంతదారుడి భూమికాని, స్థలం కాని కబ్జాచేస్తే 12ఏండ్లలోపు యజమాని చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో కబ్జా దారులకు పూర్తి హక్కులు సంక్రమిస్తాయని తీర్పు ఇవ్వటం శోచనీయం. చట్టాలు లేకుండానే నయానో భయానో అధికార బలంతో, నాయకుల అండదండలతో కబ్జాలు చేస్తున్నారు. ఈ చట్టం వల్ల మరింత పెట్రేగిపోయే ప్రమాదం ఉంది. త్రిసభ్య కమిటీ తీర్పును పునర్ పరిశీలించాల్సిన అవసరం ఉంది. ధర్మాసన తీర్మానాన్ని సామాజిక వాదులు న్యాయవాదులు పునర్ పరిశీలించాలని విజ్ఞప్తి చేయాలి. లేకుంటే భవిష్యత్లో దీనివల్ల ఎక్కువ నష్టపోయేది మధ్యతరగతి కుటుంబాలే. విదేశాల్లో స్థిరపడి ఆస్తులున్నవారికి ఇదో పెద్ద సమస్యగా పరిగణించేదిగా ఉంది. దీనివల్ల మంచి కన్నా చెడే ఎక్కువ. సుప్రీంకోర్టు త్రిసభ్యకమిటీ తీర్పుపై విశ్లేషణ చేసి పునర్ పరిశీలించాలని లిమిటేషన్ చట్టం వల్ల ఎదరయ్యే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.
- ఎ. ఆర్. రామారావు, ఖమ్మం.